మరో కేంద్ర మంత్రికి కరోనా పాజిటివ్.. బీజేపీ వర్గాల్లో ఆందోళన

కరోనా ఎవరిని వదలడం లేదు.సామాన్యుల నుంచి సెలబ్రెటీలతో పాటు రాజకీయ నేతల వరకు కరోనా బారిన పడుతున్నారు.

 Smriti Irani Tests Positive  Bjp, Smruthi Irani, Venkaiah Naidu, Amithab Bachan,-TeluguStop.com

ఇప్పటికే పలువురు సినీ సెలబ్రెటీలతో పాటు పలవురు ప్రముఖ రాజకీయ నేతలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.బిగ్ బి అమితాబ్ బచ్చన్ కరోనా బారిన పడి కోలుకోగా.

రాజకీయ నాయకుల్లో ఇటీవల కేంద్ర హోంశాఖ అమిత్ షా కరోనా నుంచి కోలుకున్నారు.

ఇక ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇటీవల కరోనా బారిన పడి కోలుకున్నారు.

ఈ క్రమంలో తాజాగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు.

తనకు కరోనా సోకడంతో హోం ఐసోలేషన్‌లోకి వెళ్లినట్లు ఆమె సోషల్ మీడియాలో వెల్లడించారు.

ఇటీవల తనతో టచ్‌లోకి వచ్చిన వారంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని ఆమె ట్విట్ చేశారు.

అయితే స్మృతి ఇరానీకి కరోనా సోకిడంతో బీజేపీ వర్గాల్లో ఆందోళన మొదలైంది.ఆమె కరోనా నుంచి కోలుకుని తిరిగి రావాలంటూ బీజేపీ నేతలు, కార్యకర్తలతో పాటు ఆమె అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

ఆమె తిరిగి వస్తారని ఆశిస్తున్నట్లు బీజేపీ నేతలు ట్వీట్‌లు చేస్తున్నారు.ఎప్పటినుంచో బీజేపీలో ఉన్న స్మృతి ఇరానీకి ఆ పార్టీలో వర్గాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది.

అయితే వరుసగా బీజేపీ నేతలు కరోనా బారిన పడుతుండటంతో ఆ పార్టీ వర్గాల్లో ఆందోళన మొదలైంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube