స్పైస్జెట్ విమానంలో ఓ ప్రయాణికుడు ధూమపానం చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.ఈ వీడియోపై తీవ్రంగా స్పందించిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దర్యాప్తునకు ఆదేశించింది.
సదరు ప్రయాణికుడు గుర్గావ్ కు చెందిన బాబీ కటారియాగా గుర్తించిన అధికారులు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
విమానం సీట్లపై పడుకుని కాలుపై కాలువేసుకుని లైటర్ తో సిగరెట్ అంటించినట్లు స్పష్టంగా ఉన్న ఈ వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు.దీని వల్ల విమానంలోని ప్రయాణికుల భద్రతకు ముప్పు వాటిల్లిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏదైనా ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.ఈ వీడియోపై పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పందించారు.
ఘటనపై విచారణ జరుగుతోందని, ఇలాంటి వాటిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.ఇది పాత వీడియో అని విమానయాన శాఖ వర్గాలు తెలిపాయి.
అయినప్పటికీ కేసు నమోదు అయిందని, చర్యలు తప్పవని స్పష్టం చేసింది.