సూర్యాపేట జిల్లాలోని హైటెక్ బస్టాండ్ ఆవరణలో పచ్చని చెట్లతో అడవిలా కనిపిస్తుంది.ఆ పచ్చటి ఆవరణ ప్రయాణికులకు ఆహ్లాదాన్ని పంచుతుంది.
సుమారు ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ హైటెక్ బస్టాండ్ లో ఆర్టీసీ అధికారులు హరితహారంలో భాగంగా ప్రతి సంవత్సరం మొక్కలు నాటుతూ వచ్చేవారు.
ఇంకా ఆ మొక్కలు పెరిగి చిట్టడివిలా అందంగా కనిపిస్తున్నాయి.
ఇంకా ఈ బస్టాండ్ వచ్చి వెళ్లే మార్గాల్లోనూ చెట్లు ఎంతో అందంగా ప్రయాణికులకు స్వాగతం పలుకుతున్నట్టు ఉన్నాయి.అంతేకాదు.
అక్కడ కొన్ని పూలమొక్కలు కూడా ఉన్నాయి.వాటికీ ప్రత్యేకమైన కంచె ఏర్పాటు చేసి సంరక్షిస్తున్నారు.
ఇంకా ఈ హరితహారంలో భాగంగా టేకు, వేప, కానుగ, నల్లమద్ది తదితర చెట్లు కూడా బస్టాండ్ ఆవరణాన్ని పచ్చదనంతో చల్లగాలితో ఎంతో అందంగా చేశాయి.ఇంకా బస్టాండ్ లో ఉన్న క్యాంటిన్ వెనుక భాగంలో మినీ పార్కు కూడా ఏర్పాటు చేశారు.
కాగా ఆరో విడతలో కొత్త బస్టాండ్, డిపో గ్యారేజీ ఆవరణలో ముక్కలు నాటాలని నిర్ణయించుకున్నారట.
అంతేకాదు.
ఈ హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యతను కొంతమంది సిబ్బందికి అప్పగించినట్టు డిపో మేనేజర్ రామకృష్ణ తెలిపారు.ఏది ఏమైనా హరితహారంతో బస్టాండ్ ఇంత అందంగా మారింది అంటే మంచి విషయం అనే చెప్పాలి.