అవును.ఈ ఘటన నిజంగానే అందరిని కంటతడి పెట్టిస్తుంది.సృష్టిలో ఏదైనా ఒక అద్భుతం ఉంది అంటే.అది ఒక బిడ్డకు జన్మనివ్వడమే.అందరూ తల్లిలు కాలేరు.కొందరికే ఆ భాగ్యం ఉంటుంది.
అది మనుషులకు అయినా.జంతువులకు అయినా.
బిడ్డకు జన్మనివ్వడం అనేది అద్భుతం అనే చెప్పాలి.
అలాంటిది ఓ జింక ప్రసవవేదన వేళ దానిపై అమానుషంగా కుక్కలు దాడి చేశాయి.
దీంతో జింక పిల్ల సహా తల్లి కూడా మృత్యువాత పడింది.అయితే ఈ హృదయ విదారక ఘటన నడిరోడ్డుపై జరగడంతో ప్రస్తుతం ప్రజలందరి కంట కన్నీరు తెప్పిస్తుంది.
ఈ ఘటన హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం పరిసరాల్లో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
అయితే మూర్తి చెందిన జింకను పరిశీలించిన అధికారులు.
పురిటి నొప్పులతో భాదపడుతున్న జింక అందుకు అనువైన ప్రదేశాన్ని పరిశీలిస్తూన్న సమయంలో కుక్కలు దాడికి పాల్పడ్డాయని అధికారులు భావిస్తున్నారు.కాగా ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ ఫోటో చుసిన ప్రతిఒక్కరు అయ్యో అనకుండా ఉండలేరు.
అంతటి బాధాకరమైన ఘటన ఇది.