తప్పు ఒకరు చేస్తే దాని ఫలితం మరొకరు అనుభవిస్తున్నారు.అందులో అభం శుభం తెలియని పసి వారు కూడా ఉండటం బాధాకరం.
ఈ మధ్యకాలంలో ఒక యువతి అప్పుడే పుట్టిన పసికందును ముళ్లపొదల్లో పడేసి చంపేసింది.ఇక ఆస్పత్రుల్లో అయితే చంటిపిల్లల మరణాలకు లెక్కేలేదు.
వైద్యుల నిర్లక్ష్యం వల్ల కూడా ప్రాణాలు పోతున్న చిన్నారులు ఏం తప్పుచేశారు.ఈ ప్రశ్న ఆ పసికందుల మనసుల్లో మెదిలిన బయటకు చెప్పలేరు కదా.
ఇకపోతే ఖమ్మం జిల్లాలో జరిగిన ఇలాంటి దారుణం గురించి తెలుసుకుంటే స్దానికంగా నివసించే ఓ దంపతులు తన నాలుగేళ్ల చిన్నారికి స్వల్ప అనారోగ్యం కలగడంతో బిలీఫ్ హాస్పిటల్ తీసుకు వెళ్లారట.కాగా ఆ చిన్నారిని పరిశీలించిన వైద్యులు ఇంజక్షన్ ఇవ్వగా అదికాస్త వికటించడంతో ఇంజక్షన్ ఇచ్చిన కొద్ది సేపట్లోనే ఆ చిన్నారి మృతి చెందిందట.
దీంతో మృతురాలి బంధువులు, కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్దకు భారీగా చేరుకుని దాడి చేయగా, ఈ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.ఇక సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారట.