అవును, మీరు వింటున్నది నిజమే. ఎయిమ్స్ రికార్డ్స్ లో మొట్ట మొదటిసారిగా ఆరేళ్ల బాలిక అవయవదానం చేసింది.
ఎలా అనేగా మీ అనుమానం.ఆ బాలిక చనిపోతూ చనిపోతూ మరో ఐదుగురికి అవయవ దానం చేసి, వారి ప్రాణాలను కాపాడి, రికార్డులకెక్కింది.
తాజాగా వెలుగు చూసిన ఘటన ఢిల్లీలో జరిగింది.వివరాల్లోకి వెళితే, నోయిడాలో ఆరేళ్ల బాలిక అయినటువంటి రోలీ ప్రజాపతిపై గుర్తుతెలియని దుండగులు ఏప్రిల్ 27న కాల్పులు జరపగా, బాలిక కోమాలోకి వెళ్ళిపోయింది.
బాలిక తల్లిదండ్రులు ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కు తరలించారు.అప్పటి నుంచి బాలిక కోమాలోనే వుంది.
బుల్లెట్లు బాలిక తలలోనికి దూసుకుపొవడం వలన తలలో రక్తం గడ్డకట్టింది.దీంతో బాలిక బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు నిర్దారించారు.కాగా, ఈ ఘటనపై సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ దీపక్ గుప్తా మాట్లాడుతూ.బాలిక తల్లిదండ్రులకు బ్రెయిన్ డెడ్ విషయాన్ని తెలిపారు.
అదే విధంగా ఆస్పత్రుల వైద్యులు బాలిక కుటుంబ సభ్యులకు అవయవ దానం గురించి తెలిపారు.కాసేపటికి బాలిక కుటుంబ సభ్యులు అవయవ దానానికి ముందుకు వచ్చారు.
దీంతో డాక్టర్లు వాటికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.
ఈ క్రమంలో బాలిక కాలేయం, మూత్రపిండాలు, కార్నియాలు మరియు గుండె కవాటం రెండూ విరాళంగా ఇవ్వబడతాయి.వీటిని అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న మరో ఐదుగురికి ఆపరేషన్ చేసి వారి ప్రాణాలు కాపాడారు.కాగా, ఈ అవయవ దానంతో, రోలీ ప్రజాపతి ఢిల్లీలోని ఎయిమ్స్ చరిత్రలో అతి పిన్న వయస్కురాలైన దాతగా నిలిచారు.
తన పెంపుడు కుక్క మరణించిన తర్వాత.వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించి గొప్పమనస్సు చాటుకున్నాడు.
ఈ సందర్భంగా దాదాపు 100 కుక్కలను పిలిచి వాటికి భోజనం పెట్టాడు.హుగ్లీలోని చందన్ నగర్కు చెందిన తరుణ్ ఘోష్ దస్తీదార్కు జంతువులంటే ఎంతో మక్కువ ఎక్కువ.