సరదా కోసం చేసే పనులు సరదాగానే ఉండాలి కానీ కాస్త విచిత్రంగా ఉన్నాయి అంటే ఏకంగా ప్రాణాలమీదికి వస్తూ ఉంటుంది.తాజాగా ఇక్కడ అలాంటి ఘటనే జరిగింది.
తన బావ మరిదికి సరదాగా గంజాయి ని మెంతికూర అని చెప్పి ఇచ్చాడు ఒక వ్యక్తి.ఇక ఇది నమ్మిన సదరు వ్యక్తి ఇంటికి తీసుకెళ్లగా కుటుంబ సభ్యులు గంజాయిని కూరగా వండారు.
దీంతో అందరూ అస్వస్థతకు గురై ఏకంగా ప్రాణాల మీదికి తెచ్చుకున్నారు.
ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది.
కన్నౌజ్ జిల్లా మియమంగ్ గ్రామానికి చెందిన ఓం ప్రకాష్ అనే వ్యక్తి గంజాయి ని మెంతికూర చెప్పి సరదాగా తన బావమరిది ఇచ్చాడు.అయితే అది గంజాయి అని గుర్తించని నితిష్ బావ ఇచ్చాడు కదా అని సంతోషంగా ఇంటికి తీసుకెళ్లారు.
ఇంట్లో వాళ్ళు కూడా అది మెంతికూర అనుకొని కూర చేశారు.హాయిగా అందరూ భోజనం చేశారు.కానీ ఇది తిన్న కాసేపటికే… కుటుంబ సభ్యులందరికీ మత్తెక్కి తీవ్ర అస్వస్థతకు గురై హాస్పటల్ పాలయ్యారు.
ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ ఒక్కొక్కరు గా స్పృహతప్పి ఎక్కడికక్కడ కుప్పకూలిపోవడంతో ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడం తో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.కాగా పోలీసులు విచారించగా అసలు విషయం బయట వచ్చింది.దీంతో మెంతికూర అని చెప్పి గంజాయి ఇచ్చిన ఓం ప్రకాష్ ను అరెస్ట్ చేశారు పోలీసులు.గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.