చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని నాశనం చేస్తుంది.దేశంలోనూ కరోనా విజృంభణ దారుణంగా ఉంది.
ఇంకా ఈ నేపథ్యంలోనే ఒకే కుటుంబానికి చేసిన ఆరుమందిని బలి తీసుకుంది.పూర్తి వివరాల్లోకి వెళ్తే.
ఝార్ఖండ్ ధన్బాద్ జిల్లా కత్రాస్కు చెందిన చౌదరి కుటుంబంలో ఒక్కొక్కరిగా ఆరుగురిని బలిగొంది కరోనా వైరస్.
ఢిల్లీలో కుమారుడు వద్ద ఉంటున్న 88 తల్లి పెళ్లికి హాజరయ్యేందుకు ధన్బాద్కు వచ్చింది.
అయితే పెళ్లి పూర్తయ్యాక ఆమెకు అనారోగ్యానికి గురైంది.దీంతో ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూనే ఆమె మృతి చెందారు.
అప్పటికే ఆమెకు కరోనా సోకిందేమోనని పరీక్షా చెయ్యగా టెస్ట్ ఫలితాలు రాలేదు.
దీంతో ఐదుగురు కుమారులు కలిసి ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు.
ఆ తర్వాత ఆ వృద్ధురాలికి కరోనా ఉందని తేలింది.కరోనా టెస్ట్ ఫలితం వచ్చే లోపే ఓ తనయుడు కరోనా బారినపడి మృతి చెందాడు.
ఆపై నలుగురు కుమారులకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది.ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒక్కొక్కరిగా 16 రోజుల వ్యవధిలో మృత్యు ఒడిలోకి చేరారు.