విశాఖపట్టణం జిల్లా కొయ్యూరు మండలం ఏజెన్సీ ఏరియా లో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.మంప పోలీస్ స్టేషన్ పరిధిలో గ్రేహౌండ్స్ దళాలు, మావోయిస్టులకు మధ్య భీకరమైన కాల్పులు జరగటంతో మావోయిస్టులు ఆరుగురు మృతి చెందినట్లు సమాచారం.
మావోయిస్టులు ఉన్నట్లు పక్కా సమాచారం పోలీసులకు తెలియడంతో కూంబింగ్ నిర్వహించడానికి పోలీసులు రంగంలోకి దిగారు.దీంతో ఈ రోజు ఉదయాన్నే తెల్లవారుజామున మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
దట్టమైన అడవి ప్రాంతం కావడంతో జరిగిన కాల్పుల్లో ఎంతమంది చనిపోయారు ఎవరు చనిపోయారు అన్న దాన్ని వివరాలు పూర్తిగా తెలియటానికి ఇంకా టైం పడుతుంది అని కొయ్యూరు సీఐ చెప్పుకొచ్చారు.చాలా మంది మావోయిస్టు అగ్రనేతలు తప్పించుకున్నట్లు దీంతో ఇంకా కూంబింగ్ కొనసాగుతోందని చెప్పారు.
ఇదే క్రమంలో మావోయిస్టు అగ్ర నేతలను పట్టుకోవడానికి ఇంకా అదనపు బలగాలను తరలించినట్లు ఘటన ప్రాంతంలో ఏకే-47 తుపాకులు లభ్యమయ్యాయని చెప్పుకొచ్చారు.
.