కర్ణాటక రాష్ట్రంలో క్వారీలలో నిల్వచేసిన జిలెటిన్ స్టిక్స్ ఒక్కసారిగా పేలడంతో అక్కడికక్కడే సిబ్బంది ఆరుగురు మృతి చెందటం జరిగింది.సరిగ్గా ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని చిక్బల్లాపూర్ లో సంభవించింది.
జరిగిన ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడటంతో వెంటనే క్షతగాత్రులను సమీపంలో ఉన్న హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు.చిక్బల్లాపూర్ జిల్లా హీరానాగవేలి సమీపంలో రాతి క్వారీలలో నిల్వ ఉంచిన జిలెటిన్ స్టిక్స్ నిర్వీర్యం చేసే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది.
అనుమతులు లేకుండా ఏర్పాటు చేయడంతో ప్రభుత్వ అధికారులు వెంటనే నిర్వీర్యం చేయాలని యాజమాన్యాలకు తెలపడంతో.నిర్వీర్యం చేసే ప్రక్రియలో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ప్రమాదంలో స్పాట్ లో ఆరుగురు మృతి చెందటం కర్ణాటక లో సంచలనం సృష్టించింది.
వెంటనే సంఘటనా స్థలాన్ని రాష్ట్ర ఆరోగ్య మంత్రి కే సుధాకర్ సందర్శించారు.అక్రమంగా పేలుడు పదార్థాలను నిల్వ ఉంచిన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
.