గుంటూరు జిల్లా లో పెను ప్రమాదం సంభవించింది.విద్యుత్ షాక్ తో ఏకంగా ఆరుగురు మరణించడం జరిగింది.
ఈ సంఘటన రొయ్యల చెరువు దగ్గర సంభవించింది.గుంటూరు జిల్లా రేపల్లె మండలం లంక వాణి దిబ్బ లో ఈ పెను ప్రమాదం సంభవించింది.
రొయ్యల చెరువు వద్ద ఆరుగురు ఒడిశా రాష్ట్రానికి చెందిన వాసులు కాపలాగా ఉన్న సమయంలో గురువారం అర్ధరాత్రి చెరువు గట్లపై నిద్రపోతున్న టైంలో ఆరుగురిపై విద్యుత్ వైర్లు ఒక్కసారిగా తెగి పడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
దీంతో వెంటనే స్థానికులు సమాచారం ఇవ్వటంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు స్టార్ట్ చేశారు.
అనంతరం మృతుల వివరాలను తెలుసుకున్న పోలీసులు మీడియాకు తెలియజేశారు.రామ్మూర్తి, కిరణ్, మనోజ్ పండబో, మహేంద్ర, నవీన్ లాగా పోలీసులు గుర్తించడం జరిగింది.ఒక్కసారిగా వైర్లు తెగి పడటంతో అక్కడికక్కడే ఏ దారుణ సంఘటన చోటు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.