లాక్డౌన్ సమయంలో ఎంతో మంది పరిస్థితి అధ్వానంగా మారిపోయిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ వ్యాప్తి దృశ్య విధించిన లాక్ డౌన్ ఎంతో మంది జీవితాలను చిన్నాభిన్నం చేసింది.
ప్రస్తుతం సడలింపు ఇచ్చినప్పటికీ ఆ ఎఫెక్ట్ మాత్రం పోవడం లేదు.అయితే చాలామంది లాక్ డౌన్ సమయంలో ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన విషయం తెలిసిందే.
ఇక్కడ ఓ కుటుంబానికి చెందిన ఆరుగురు లాక్ డౌన్ ఎఫెక్ట్ కారణంగా ఆత్మహత్య చేసుకొని చనిపోవడం సంచలనంగా మారిపోయింది.ఈ విషాద ఘటన గుజరాత్లోని అహ్మదాబాద్ లో చోటుచేసుకుంది.
అమ్రిష్ పటేల్ గౌరవ పటేల్ అనే ఇద్దరు అన్నదమ్ములు తమ నలుగురు పిల్లలను బయటకు తీసుకు వెళుతున్నాం అని భార్యలకు చెప్పి బయటికి వెళ్లారు.ఇక చీకటి పడుతుంది కానీ ఇప్పుడే వస్తామని వెళ్ళినవారు ఎంతకీ రాలేదు.
దీంతో కంగారు పడిపోయిన ఆ వ్యక్తుల భార్యలు పోలీసులను ఆశ్రయించగా రంగంలోకి దిగిన పోలీసులు తమ భర్తలతో పాటు తమ నలుగురు పిల్లలు కూడా విగతజీవులుగా కనిపించడం గుర్తించారు.ఇక కాస్త లోతుగా దర్యాప్తు చేస్తే సోదరులకు 45 లోన్స్ ఉన్నాయని… ఏకంగా 35 లక్షల అప్పు ఉంది అంటూ గుర్తించారు పోలీసులు.
అప్పుల బాధలు తాళలేకే ఇలా ఆత్మహత్యకు పాల్పడినట్లు నిర్ధారించారు.