కరోనా తీసిన ప్రాణం... ఆరుగురు ఆత్మహత్య..?

లాక్‌డౌన్‌ సమయంలో ఎంతో మంది పరిస్థితి అధ్వానంగా మారిపోయిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ వ్యాప్తి దృశ్య విధించిన లాక్ డౌన్‌ ఎంతో మంది జీవితాలను చిన్నాభిన్నం చేసింది.

 Six Family Members Committed Suicide To Rs 35 Laks Debt,committed Suicide, Gujar-TeluguStop.com

ప్రస్తుతం సడలింపు ఇచ్చినప్పటికీ ఆ ఎఫెక్ట్ మాత్రం పోవడం లేదు.అయితే చాలామంది లాక్ డౌన్ సమయంలో ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన విషయం తెలిసిందే.

ఇక్కడ ఓ కుటుంబానికి చెందిన ఆరుగురు లాక్ డౌన్ ఎఫెక్ట్ కారణంగా ఆత్మహత్య చేసుకొని చనిపోవడం సంచలనంగా మారిపోయింది.ఈ విషాద ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్ లో చోటుచేసుకుంది.

అమ్రిష్ పటేల్ గౌరవ పటేల్ అనే ఇద్దరు అన్నదమ్ములు తమ నలుగురు పిల్లలను బయటకు తీసుకు వెళుతున్నాం అని భార్యలకు చెప్పి బయటికి వెళ్లారు.ఇక చీకటి పడుతుంది కానీ ఇప్పుడే వస్తామని వెళ్ళినవారు ఎంతకీ రాలేదు.

దీంతో కంగారు పడిపోయిన ఆ వ్యక్తుల భార్యలు పోలీసులను ఆశ్రయించగా రంగంలోకి దిగిన పోలీసులు తమ భర్తలతో పాటు తమ నలుగురు పిల్లలు కూడా విగతజీవులుగా కనిపించడం గుర్తించారు.ఇక కాస్త లోతుగా దర్యాప్తు చేస్తే సోదరులకు 45 లోన్స్ ఉన్నాయని… ఏకంగా 35 లక్షల అప్పు ఉంది అంటూ గుర్తించారు పోలీసులు.

అప్పుల బాధలు తాళలేకే ఇలా ఆత్మహత్యకు పాల్పడినట్లు నిర్ధారించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube