టాలీవుడ్ ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అస్వస్థతకు గురయ్యారు.2 రోజుల క్రితం న్యూమోనియా తో బాధపడుతూ హైదరాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చేరారు.ప్రస్తుతం ఆయనను కిమ్స్ వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లుగా సమాచారం.ఇక టాలీవుడ్ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.దశాబ్దాలుగా తెలుగు సినిమాలకు రచయితగా సేవలందించిన వ్యక్తి సిరివెన్నెల సీతారామశాస్త్రి.
అలాంటి వ్యక్తి గురించి ఊహించని వార్త వినిపించడంతో ఇండస్ట్రీలో పలువురు ప్రముఖులతో పాటు అతని అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నారు.
అయితే అతడి ఆరోగ్య పరిస్థితి గురించి తాజాగా కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం స్పందించింది.ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని తెలిపారు.
ఇటీవలే సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఆర్ఆర్ఆర్ సినిమాలో దోస్తీ అనే పాటకు లిరిక్స్ కూడా అందించారు.సిరివెన్నెల ఉపయోగించే పదజాలం ఎలా ఉంటుంది అంటే అతను వాడే పదాలు డిక్షనరీలో వెతుక్కోవాల్సిందే మరి.
సిరివెన్నెల త్వరగా కోలుకోవాలని సినీ నటులతో పాటు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా కోరుకుంటున్నారు.సీతారామశాస్త్రి తన సినీ జర్నీలో ఎన్నో అద్భుతమైన పాటలను రాశారు.అలా తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్నారు.పాటలు రాయడంలో ఎంతోమంది దిగ్గజ మహానుభావులు ఉన్నారు.వారిలో సిరివెన్నెల సీతారామశాస్త్రి కూడా ఒకరు.ఇండస్ట్రీలోకి మొట్టమొదటిసారిగా సిరివెన్నెల అనే చిత్రం ద్వారా పరిచయం అయ్యారు.
ఈ చిత్రంలో ఇతని పాటలకు బెస్ట్ లిరిసిస్ట్ గా నంది అవార్డును కూడా అందుకున్నారు.