పుష్ప సినిమా తో పాన్ ఇండియా స్థాయిలో రష్మిక మందన్నా స్టార్ హీరోయిన్ గా నిలిచిన విషయం తెలిసిందే.శ్రీవల్లి గా ఆ సినిమా లో తన నటన తో, అందం తో ఆకట్టుకుంది.
ప్రతి సన్నివేశం లో కూడా రష్మిక మందన్నా మెప్పించి ఆకట్టుకుంది.ఇప్పుడు అదే తరహా లో దేశవ్యాప్తం గా సీతారామం సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించేందుకు సిద్ధం అయ్యింది.
ఈ సినిమా లో రష్మిక మందన్నా పాత్ర చాలా విభిన్నం గా ఉండబోతోందని.రెండు విభిన్నమైన పాత్ర ల్లో ఆమె కనిపించబోతున్నట్లు ఇటీవల విడుదలైన ట్రైలర్ ను మరియు విజువల్స్ ను చూస్తుంటే అనిపిస్తుంది.
ఈ సినిమా ఫస్ట్ లుక్ లో ఆమె ఒక ముస్లిం యువతి గా కనిపించింది.ఆ తర్వాత నార్మల్ హిందూ యువతి గా కూడా కనిపిస్తున్నట్లు గా విజువల్స్ వస్తున్నాయి.
కనుక ఈ సినిమాలో రష్మిక మందన్నా రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.
టైం ట్రావెల్ కి సంబంధించిన సినిమా అన్నట్లుగా ఈ సినిమా గురించి వార్తలు వస్తున్నాయి.
రెండు కాలాల్లో కూడా రష్మిక పాత్ర ఉంటుందని.తద్వారా అక్కడి వారికి ఇక్కడి వారికి కనెక్ట్ అయ్యేలా సన్నివేశాల్లో రష్మిక మందన్నా ఉంటుందని సమాచారం అందుతోంది.
అసలు విషయం ఏంటి అనేది రేపు సినిమా విడుదలైతే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.సినిమా కు ఆ పాత్ర అత్యంత కీలకం కనుక రష్మిక మందన ఆ పాత్ర ను చేసేందుకు ఒప్పుకుందని దర్శకుడు హను రాఘవపూడి ఇటీవల మీడియా సమావేశం లో వెల్లడించిన విషయం తెలిసిందే.
హీరోయిన్ గా నెంబర్ వన్ స్థానం లో ఉన్న రష్మిక మందన హీరోయిన్ పాత్ర ను కాకుండా ఇలా ముఖ్యమైన పాత్ర ను చేయడం విడ్డూరంగా ఉంది అంటూ అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.కానీ సినిమా విడుదలైన తర్వాత కచ్చితంగా రష్మిక మందన్నా స్థాయి పాత్ర ఇది అంటూ ప్రతి ఒక్కరు అభినందిస్తారు అంటూ వైజయంతి మూవీస్ కి సంబంధించిన వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.