దుల్కర్ సల్మాన్ హీరో గా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా రూపొందిన సీతారామం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.ఈ సినిమా కు హను రాఘవపూడి దర్శకత్వం వహించగా అశ్వినీదత్ నిర్మించాడు.
వైజయంతి మూవీస్ బ్యానర్ లో వచ్చిన ఈ ప్రతిష్టాత్మక సినిమా కు మంచి స్పందన దక్కింది.ఇప్పటికే ఈ సినిమా కు భారీ వసూళ్లు నమోదు అయినట్లుగా ట్రేడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికా లో కూడా ఈ సినిమా కు వస్తున్న వసూళ్లు ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.దుల్కర్ సల్మాన్ కి మలయాళం కు చెందిన హీరో కనుక సహజంగానే అక్కడ భారీ వసూళ్లు నమోదు చేస్తోంది.
కానీ తమిళ మరియు కన్నడ సినీ ఇండస్ట్రీలో మాత్రమే ఈ సినిమాకు ఎక్కువగా వసూలు రావడం లేదు.అక్కడ ఇప్పటి వరకు కనీసం కోటి రూపాయల గ్రాస్ కలెక్షన్లు కూడా వసూలు చేసింది లేదని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
సినిమా ఆశించిన స్థాయిలో ప్రమోషన్ చేయక పోవడం వల్ల కూడా ఈ పరిస్థితి ఉంటుందని అంటున్నారు.ప్రమోషన్ భారీ గా చేసి ఉంటే ఖచ్చితంగా ఈ లవ్ స్టోరి కి అద్భుతమైన రెస్పాన్స్ కూడా వచ్చి ఉండేది అని మీడియా వర్గాల వారు మరియు సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా కు సంబంధించిన వసూళ్ల లెక్కలు అందరిలో కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వస్తున్న వసూళ్లు మూడు రోజుల పాటు జోరుగా ఉన్నాయి.
దాంతో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ సాధ్యమైంది అంటూ సమాచారం అందుతోంది.ముందు ముందు లాభాలు భారీ గా దక్కడం తో పాటు చిత్ర యూనిట్ సభ్యులకు మంచి పేరు ను కూడా తీసుకు వస్తుందని అంటున్నారు.
మరో వైపు నందమూరి కళ్యాణ్ రామ్ హీరో గా నటించి తెరకెక్కిన ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన బింబిసార సినిమా కూడా మంచి వసూళ్ల ను దక్కించుకుంటుంది.ఒకే సారి రెండు సినిమా లు బాక్సాఫీసు వద్ద దుమ్ము రేపుతున్న నేపథ్యం లో టాలీవుడ్ కి మంచి రోజులు వచ్చాయి అంటూ సినీ పెద్దలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.