టాలీవుడ్ కింగ్ నాగార్జున గత సంవత్సరం ది ఘోస్ట్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.ఆ సినిమా పై చాలా ఆశలు పెట్టుకున్న నాగార్జున కు నిరాశ మిగిలింది.
అక్కినేని ఫ్యాన్స్ సినిమా విషయం లో తీవ్ర విమర్శలు చేస్తూ దర్శకుడి పై ఆగ్రహం వ్యక్తం చేశారు.నాగార్జున ఈ మధ్య కాలం లో ఏ సినిమా చేసినా కూడా సరైన ఫలితాన్ని ఇవ్వడం లేదు.
అందుకే కాస్త గ్యాప్ తీసుకుని మంచి కథ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.
రచయితగా ఈ మధ్య కాలం లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు బెజవాడ ప్రసన్న కుమార్.ఈయన ఇటీవల విడుదలైన ధమాకా సినిమా కి కథ, స్క్రీన్ ప్లే, మరియు డైలాగ్స్ ని అందించాడు.ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
ధమాకా విడుదల అయ్యి సక్సెస్ టాక్ దక్కించుకున్న వెంటనే నాగార్జున పిలిచి మరీ బెజవాడ ప్రసన్న కుమార్ కి దర్శకత్వం ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది.ఆ మధ్య సినిమా గురించి హడావిడి జరిగింది.
కానీ ఫ్రీ ప్రొడక్షన్ వర్క్ విషయంలో ఆలస్యమైంది.ఎట్టకేలకు సినిమా షూటింగ్ మొదలు పెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయట.
ఇదే సమయం లో నాగార్జున కు జోడి గా సీతారామం సినిమా లో హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మృణాల్ ఠాగూర్ ని ఎంపిక చేయడం జరిగిందని తెలుస్తోంది.మృణాల్ సీతారామం సినిమా తో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ క్రేజ్ ను సొంతం చేసుకుంది.
నాని కి జోడి గా ఒక సినిమాలో నటించేందుకు తాజాగా కమిట్ అయింది.ఆ సినిమా షూటింగ్ తాజాగా ప్రారంభం అయ్యింది.ఆ వెంటనే ఇలా సీనియర్ హీరో తో సినిమాని చేసేందుకు ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ ఓకే చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.నాగార్జున వంటి సీనియర్ హీరో తో నటించిన తర్వాత యంగ్ హీరోలు ఈమెని పట్టించుకుంటారా అనేది అనుమానమే అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సీతారామం వంటి సూపర్ హిట్ తర్వాత నాని వంటి యంగ్ హీరోల తో సినిమాలు చేస్తే బాగుంటుంది అంటూ ఆమె అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.