టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రిన్సెస్ సితార గురించి అందరికీ తెలిసిందే.ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తెగ బిజీగా ఉంటుంది.
తనకు సంబంధించిన ఫోటోలను, వీడియో లను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది.అంతేకాకుండా సీతార కొన్ని విషయాల గురించి తెలుపుతూ ఫాలోవర్స్ తో పంచుకుంటుంది.
తన సోషల్ మీడియా అకౌంట్లలో ఎంతో మంది ఫాలోవర్స్ ఉన్నా సితార.బుల్లి స్టార్ గా నిలిచింది.
ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో వస్తున్న సర్కారు వారి పాట సినిమాలో బిజీగా ఉన్నారు.కాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కోసం మహేష్ బాబు, పరశురాం, సినీ బృందం దుబాయ్ కి వెళ్లారు.
అంతేకాకుండా మహేష్ బాబు తన భార్య నమ్రత పుట్టినరోజు వేడుకలు కూడా దుబాయ్ లోనే జరిపారు.ఈ విధంగా దుబాయ్ లో ఉన్న మహేష్ బాబు కుటుంబం.
ట్రిప్ లతో సరదాగా గడుపుతున్నారు.ఇందులో సితార దుబాయ్ ఎడారి ట్రిప్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి చేసింది.
అంతేకాకుండా ఒంటె లతో దిగిన ఫోటోలను కూడా షేర్ చేయగా వైరల్ గా మారింది.
మహేష్ బాబు కుటుంబం మరో నెల రోజుల పాటు దుబాయ్ లో ఉంటారని తెలిపారు.సర్కారు వారి పాట సినిమాకు సంబంధించిన కొన్ని షూట్ లు ఉండగా.అక్కడ ఉన్న అందమైన ప్రదేశాలలో షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు మహేష్ బాబు.
దుబాయ్ లో ఉన్న అందమైన ప్రదేశాలకు సంబంధించిన ఫోటోలను కూడా మహేష్ బాబు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటున్నారు.ఇక మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో మరో క్రేజీ మల్టీస్టార్ కాంబినేషన్ తో వస్తున్న సినిమాల్లో చేయనున్న వార్తలు వినిపిస్తున్నాయి.