కరోనా లాక్ డౌన్ కారణంగా సెలబ్రిటీలకు సినిమా షూటింగ్స్ లేకపోయేసరికి… తాము ఇంట్లో చేసే సందడిలను వీడియోల రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.ఇందులో ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తన కుటుంబంతో కలసి చేస్తున్న వీడియోలను, చిన్నప్పటి ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటాడు.
ఫ్యామిలీ మొత్తం సోషల్ మీడియాలో వీడియోలను పోస్ట్ చేస్తుంటారు.మహేష్ బాబు భార్య నమ్రత, కూతురు సితార, కుమారుడు గౌతమ్ కూడా వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.
కాగా తన కూతురు సితార కూడా వీడియోలు తీయడం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మొదలు పెట్టింది.ఇటీవలే దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురు ఆద్యాతో కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టింది సితార.
ఇందులో తను చేసే వీడియో లను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంది.దీంతో సితార కూడా అభిమానుల ఫాలోయింగ్ ను ఓ రేంజ్ లో పెంచేసుకుంది.తన మాటలతో, ఆటలతో, డాన్స్ లతో వీడియోలను చేసి నెట్టింట్లో పెడుతూ తండ్రి వలే బిజీ అయిపోయింది సితార పాప.
అంతేకాకుండా ఈ గారాల ముద్దుగుమ్మ ఏకంగా ఓ సినిమాలో డబ్బింగ్ కూడా చేసింది.అయితే ఎప్పుడు సోషల్ మీడియా లో బిజీగా ఉండే ఈ సితార పాప తాజాగా ఇంస్టాగ్రామ్ లో మరో ఫోటోను షేర్ చేయగా నెటిజన్లు దాన్ని వైరల్ చేస్తున్నారు.ఇంతకీ ఆ ఫోటో ఏంటి? సితార చెప్పిన మాటలు ఏంటి అంటే…
తన తల్లి నమ్రత తనకు ఓ కానుక ఇచ్చిందని చెబుతూ…’ నాకు ఈ సారి దీపావళి కానుక ముందే వచ్చింది.అది సాయి బాబా ఉంగరం… దీన్ని ఎప్పటికీ నా చేతి వేలికి ఉంచుకోమని మా అమ్మ చెప్పింది.ఇలాంటి సాయిబాబా ఉంగరం మా అమ్మకు తను ఎనిమిది సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మా అమ్మమ్మ ఇచ్చారట.
ఆ బంగారు ఉంగరం ఇంకా మా అమ్మ వేలికి ఉంది.పైగా ఇప్పుడు నాకు మా అమ్మ అందించింది’ అని సితార తెలిపింది.
ఈ పోస్ట్ చుసిన నెటిజన్లు ఓహో.సితార ఉంగరం వెనుక ఇంత పెద్ద కథ ఉందా? అంటూ పోస్ట్ చేస్తున్నారు.