టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నటించిన చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమా మే 12 న విడుదల కానున్న విషయం తెలిసిందే.
ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా ముంచి పాటలు విడుదల అయినా విషయం తెలిసిందే.ఈ సినిమాలోని పెన్ని అనే ఒక ప్రమోషనల్ సాంగ్ సూపర్ స్టార్ కూతురు సితార నటించిన విషయం తెలిసిందే.
అయితే ఈ పాట సినిమాలో ఉండబోవడమే కాకుండా, ఈ పాట బిగ్ స్క్రీన్ పై వచ్చేటప్పుడు అందులో సితార కనిపించదు అన్న విషయాన్ని మహేష్ బాబు చెప్పుకొచ్చాడు.
ఈ క్రమంలోనే కనీసం ఎండ్ టైటిల్స్ లో అయినా వేయిచ్చు కదా! అని యాంకర్ సుమ అడగగా.
సితారకు లేనిపోని ఐడియాలు ఇవ్వకండి.ఆల్రెడీ ప్రింట్స్ యూఎస్కి వెళ్లిపోయాయ్ అని మహేష్ బాబు నవ్వుతూ తెలిపారు.
మొత్తానికి సర్కారు వారి పాటతో సితారకు సంబంధం ఉంది.అంతే కాకుండా సితార కూడా ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటోంది.
ఈ క్రమంలో సితారకు మహేష్ బాబుతో పని చేసిన హీరోయిన్లకు సంబంధించిన ప్రశ్న ఎదురైంది.సమంత, రష్మిక మందనల గురించి చెప్పమని సితారను అడగగా.
ఆ విషయం పై స్పందించిన.సితార.
సమంత గురించి మాట్లాడుతూ.
సామ్ ఆంటీ నాకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసింది సితార.నాతో ఎక్కువగా ఆడుకుంటుంది.సెట్లోకి వచ్చినప్పుడు నాతోనే ఉంటుంది.
ఆడుతూ ఉంటుంది.ప్లే ఫుల్ అని సమంత గురించి సితార చెప్పేసింది.
ఇకపోతే సితార కళావతి పాటకు స్టెప్పులని ఇరగదీసిన విషయం తెలిసిందే.సితార కు సోషల్ మీడియాతో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ వుంది అన్న విషయం తేలిసిందే.