టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ అధికారుల దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా సిట్ అధికారులు వంద మార్కులు దాటిన అభ్యర్థుల జాబితాను తయారు చేశారని సమాచారం.

 Sit Investigation In Tspsc Paper Leak Case In Full Swing-TeluguStop.com

ఈ నేపథ్యంలో అభ్యర్థులకు ఫోన్లు చేసి విచారణకు రావాలని పిలుస్తున్నారు.అభ్యర్థుల నుంచి సుమారు 15 అంశాలపైఅధికారులు వివరాలను సేకరిస్తున్నారు.

బయోడేటా తో పాటు  ఇంతకుముందు పరీక్షలు రాశారా? అనే విషయంపై ఆరా తీస్తున్నారని తెలుస్తోంది.అవసరమైతే మళ్లీ సంప్రదిస్తామని అధికారులు క్యాండిడేట్స్ కు తెలిపారు.

ఈ క్రమంలోనే రేపు సీట్ అధికారులు ఎదుట కొంతమంది అభ్యర్థులు హాజరుకానున్నారు.మరోవైపు ఈ కేసులో మొత్తం 15 మందిని అదుపులోకి తీసుకున్న అధికారులు దర్యాప్తును ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube