బుల్లితెరపై ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 5 మొత్తానికి నిన్నటితో పూర్తయింది.ఇక ఇందులో సన్నీ టైటిల్ విన్నర్ గా గెలిచి తనేంటో నిరూపించుకున్నాడు.
షణ్ముఖ్ రన్నరప్ గా నిలిచాడు.సన్నీ గెలవడంతో ప్రేక్షకులు సైతం తెగ మురిసిపోతున్నారు.
కానీ ఎంతో మంది అభిమానులను కూడా సంపాదించుకున్నాడు.ఇక హౌస్ లో ఉన్నంత కాలం సన్నీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.
ముఖ్యంగా షణ్ముఖ్, సిరి లు మాత్రం సన్నీ ని బాగా టార్గెట్ చేశారు.అయినా కూడా సన్నీ ఎక్కడ కూడా తన సహనాన్ని కోల్పోకుండా ఆటలో ఆడి టైటిల్ విన్నర్ గా గెలిచి ఎంతో మంచి పేరు సంపాదించుకున్నాడు.
నిజానికి హౌస్ లో ఉన్నంతకాలం బాగా రెచ్చిపోయిన జంట ఎవరంటే షణ్ముఖ్, సిరి.
వీరిద్దరు మరో ఇద్దరితో రిలేషన్షిప్ లో కూడా ఉండగా హౌస్ లో మాత్రం బాగా రెచ్చిపోయారు.
ఏకంగా హగ్ లతో, కిస్ లతో రెచ్చిపోయి అందరి ముందు బ్యాడ్ క్యారెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు.ఒకే బెడ్ పై పడుకొని.
ఒకటే దుప్పటిలో చేరి మరి రోమాన్స్ లతో బాగా చెలరేగారు.మధ్య మధ్యలో నాగార్జున వీరి మధ్య ఉన్న రిలేషన్ చూసి చాలాసార్లు కౌంటర్లు కూడా వేశాడు.
అయినా కూడా ఎక్కడ కూడా వీరిలో మార్పు మాత్రం కనిపించలేదు.అలాగే ప్రవర్తించటంతో షన్ను కు రావాల్సిన ఓట్లన్నీ తగ్గిపోయాయి.సిరి బాయ్ ఫ్రెండ్ బిగ్ బాస్ వేదికపై సిరిని టార్గెట్ చేసి మాట్లాడాడు.దాంతో సిరి ఆ రోజు బాగా ఎమోషనల్ అయ్యింది.ఆ తర్వాత సిరి లో మార్పు వస్తుందని ప్రేక్షకులందరూ అనుకున్నారు.కానీ మళ్లీ అతిగా ప్రవర్తించడంతో తనది చీప్ క్యారెక్టర్ అని నేరుగా కామెంట్లు కూడా పెట్టారు నెటిజన్లు.
గతంలో సిరి వాళ్ళ అమ్మ శ్రీదేవి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన సంగతి అందరికి తెలిసిందే.అందులో తాను చాలా ఓపెన్ గా మాట్లాడింది.
షన్ను ను హగ్ చేసుకోవడం నచ్చలేదు అంటూ.మీ హగ్ లు నాకు నచ్చలేదు అని.ఓ అన్నలా, తండ్రిలా, ఫ్రెండ్స్ లా షన్ను సాయం చేస్తున్నాడు అంటూ వాళ్ళ అమ్మ అనటంతో ఆ మాటలు అన్నీ బాగా వైరల్ గా మారాయి.
ఇక మరోసారి సిరి వాళ్ళ అమ్మ ఫైనల్ సందర్భంగా ఈ షో కు రావడంతో బాగా ఎమోషనల్ గా మాట్లాడింది.సిరి కి బిగ్ బాస్ ఇంట్లో చెప్పిన మాటలతో అందరూ తనను తిట్టారని శ్రీదేవి బాధపడింది.అలా చెప్పకూడదని అందరూ అన్నారని తెలిపింది.
వెంటనే నాగార్జున.అమ్మ చెప్పకపోతే ఇంకా ఎవరు చెబుతారు.
నీ మనసులో ఏముందో అది చెప్పారు కదా.దాంట్లో తప్పేం లేదు అని నాగార్జున తనను ఓదార్చే ప్రయత్నం చేశాడు.ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్లు నెట్టింట్లో వైరల్ గా మారాయి.