బాలీవుడ్ ప్రముఖ సింగర్ కనిక కపూర్కు కరోనా పాజిటివ్గా తేలిన విషయం తెల్సిందే.ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో కొందరు గాయనికి కరోనా పాజిటివ్ అంటూ పోస్ట్ చేశారు.
అయితే యూట్యూబ్లో కొందరు థమ్నైల్స్గా సునీత ఫొటోను పెట్టడం వివాదాస్పదం అయ్యింది.తన ఫొటోను లైట్గా బ్లర్ చేసి కరోనా పాజిటివ్ అంటూ పెట్టడంపై సునీత తీవ్రంగా స్పందించింది.
వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి చేసింది.
కరోనా పాజిటివ్ అంటూ నా ఫొటో పెట్టడంపై చందమామ కథలు అనే ఫేస్ బుక్ పై సునీత ఫిర్యాదు నమోదు చేసింది.
తెలంగాణ డీజీపీ, మంత్రి కేటీఆర్ ఇంకా సైబర్ క్రైమ్ పోలీసులకు ఈమె ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేసింది.ఇలాంటి తప్పుడు థమ్నైల్స్ పెట్టడం వల్ల మాలాంటి వారు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లుగా ఆమె చెప్పుకొచ్చింది.
ఆ పేజీ అడ్మిపైన్ చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే అంటూ ఆమె డిమాండ్ చేసింది.
కరోనా పాజిటివ్గా కనికా కపూర్ తేలడంతో మీడియాలో ప్రముఖంగా వార్తలు వస్తున్నాయి.వాటిని క్యాష్ చేసుకునేందుకు కొందరు ఇలాంటి థమ్నైల్స్ వాడుతున్నారు.ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటే ముందు ముందు మరెవ్వరు ఇలాంటి పనులు చేయరు అంటూ నెటిజన్స్ కోరుతున్నారు.
వ్యూవర్స్ను తప్పుదారి పట్టిస్తున్న ఇలాంటి వారిని సోషల్మ ఈడియా నుండి కూడా బ్యాన్ చేయాలంటూ కొందరు కోరుతున్నారు.