తెలుగులో ప్రముఖ దర్శకుడు కృష్ణ వంశీ దర్శకత్వం వహించిన “గులాబీ” అనే చిత్రంలో “ఈ వేళలో నువ్వు ఏం చేస్తూ ఉంటావు” అనే పాట పాడి తన మధురమైన గానంతో సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న “ప్రముఖ సీనియర్ సింగర్ సునీత” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.తాజాగా సింగర్ సునీత తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చి మరో వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది.
ఈ క్రమంలో అతడితో నిశ్చితార్థం కూడా చేసుకొని తనకు కాబోయే భర్త ఫోటోలను సోషల్ మీడియా మాధ్యమాలలో విడుదల చేసింది. దీంతో ఒక్కసారిగా సింగర్ సునీత నిశ్చితార్థం వార్తలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.
అంతేకాక అంతేగాక సింగర్ సునీత ను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరా.? అంటూ తెగ చర్చించుకుంటున్నారు.
సింగర్ సునీత పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి పేరు “రామ కృష్ణ వీరపనేని”.ఇతడు టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ప్రముఖ వ్యాపార వేత్తగా కొనసాగుతున్నాడు. అంతేగాక డిజిటల్ మీడియా ప్లాట్ ఫారంలో రామకృష్ణ వీరపనేని కి మంచి పేరుంది. అలాగే ప్రముఖ మ్యూజిక్ సంస్థ అయినా మాంగో మ్యూజిక్ సంస్థలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పని చేస్తున్నాడు.
అంతేకాక ఇందులో వాటాలు కూడా ఉన్నాయి.కాగా రామ కృష్ణ వీరపనేని పలు వ్యాపారాల్లో కూడా పెట్టుబడి పెట్టి ప్రస్తుతం బాగానే రాణిస్తున్నాడు.
కాగా సింగర్ సునీత ఇటీవలే తన నిశ్చితార్థ విషయంపై స్పందిస్తూ తన పిల్లల భవిష్యత్తు బాగుండాలని తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.ఏదేమైనప్పటికీ అతి పిన్న వయసులోనే పెళ్లి చేసుకొని కుటుంబ పోషణకు కోసమై ఇబ్బందులు పడినటువంటి సింగర్ సునీత తన భర్త నుంచి సరైన అండదండలు లేక సంతోషాలను కోల్పోయింది.
ఈ విషయం ఇలా ఉండగా సింగర్ సునీత 19 ఏళ్ల వయసులో కిరణ్ కుమార్ గోపరాజు అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లయినప్పటినుంచి సునీత తన భర్త చేష్టలతో విసిగిపోయి ఇటీవలే విడాకులు ఇచ్చింది.
కాగా ప్రస్తుతం సింగర్ సునీత కి ఒక కొడుకు, కూతురు ఉన్నారు.