టాలీవుడ్ సింగర్ సునీత పెళ్లి గురించి గతకొంత కాలంగా ఇండస్ట్రీ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో తీవ్ర చర్చ సాగుతోన్న సంగతి తెలిసిందే.అయితే అన్ని పుకార్లకు చెక్ పెడుతూ సునీత తన రెండో వివాహానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసింది.
ప్రముఖ వ్యాపారవేత్త రామ్ వీరపనేనితో సునీత నిశ్చితార్థం చేసుకుని తమ పెళ్లికి సంబంధించి అఫీషియల్ ప్రకటన చేసింది.త్వరలోనే తాను రెండో వివాహం చేసుకోబోతున్నట్లు తెలియజేసింది.
కాగా సునీత రెండో వివాహం చేసుకోబోతుందనే వార్తతో సెలెబ్రిటీల దగ్గర్నుండి మొదలుకొని ఆమె అభిమానుల వరకు అందరూ శుభాకాంక్షలు తెలుపుతూ ఆమెకు గ్రీటింగ్స్ పంపుతున్నారు.జనవరిలో తాము వివాహం జరుపుకుంటున్నట్లు రామ్-సునీత తెలపడంతో అందరూ వారికి అభినందనలు తెలుపుతున్నారు.
కాగా టాలీవుడ్ హీరో నితిన్ తాజాగా ఈ కాబోయే దంపతులకు ఓ అదిరిపోయే పార్టీ ఇచ్చాడట.రామ్ వీరపనేనికి మంచి సన్నిహితుడైన హీరో నితిన్, హైదరాబాద్లోని గచ్చిబౌలిలోని ఓ స్టార్ హోటల్లో వారికి అదిరిపోయే విందునిచ్చాడట.
త్వరలో పెళ్లి చేసుకోబోతున్న కారణంగా నితిన్ సునీత-రామ్లకు ఈ ట్రీట్ ఇచ్చాడు.కాగా ఈ పార్టీకి టాలీవుడ్కు చెందిన పలువురు సెలబ్రిటీలు సైతం హాజరైనట్లు తెలుస్తోంది.
వారిలో యాంకర్ సుమ, రేణు దేశాయ్ తదితరులు ఉన్నట్లు తెలుస్తోంది.ఇక సునీత, రామ్ వీరపనేని త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కుతుండటంతో వారి జీవితం సంతోషంగా సాగిపోవాలని పలువురు ఈ సందర్భంగా కోరారు.
కాగా సోషల్ మీడియాలో సునీత రామ్ వీరపనేనిలకు సంబంధించిన నిశ్చితార్థ ఫోటోలు వైరల్గా మారిన సంగతి తెలిసిందే.మరి ఈ దంపతులు ఎప్పుడు, ఎక్కడ పెళ్లి చేసుకుంటున్నారనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
ఏదేమైనా గతకొంత కాలంగా తన పెళ్లి గురించి వస్తున్న వార్తలకు ఎట్టకేలకు సునీత చెక్ పెట్టడంతో ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.