టాలీవుడ్ స్టార్ సింగర్లలో ఒకరైన సునీతకు రెండో పెళ్లి తరువాత సింగర్ గా ఆఫర్లు అంతకంతకూ పెరుగుతున్నాయి.సునీత కూడా పలు షోలు, ఈవెంట్లలో పాల్గొంటూ పాపులారిటీని అంతకంతకూ పెంచుకుంటున్నారు.
ప్రస్తుతం సునీత డ్రామా జూనియర్స్ అనే షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు.జీ తెలుగు ఛానల్ లో ఈ షో ప్రసారమవుతూ ఉండగా ఈ షోలో సింగర్ సునీత ఎమోషనల్ కావడంతో పాటు కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఈ షో ప్రోమో రిలీజ్ కాగా ఎస్వీ కృష్ణారెడ్డి రవిని ఎప్పుడూ సోలోగా యాంకర్ గా ఉండవు కదా అడగగా ఇద్దరు అందమైన జడ్జీలు ఉండగా యాంకర్ ఎందుకని ఆమె ప్రశ్నించారు.స్కిట్ లో ఒక చిన్నారి చిన్నప్పటి నుండి హీరోయిన్ కావాలని కలలు కని తండ్రికి ఇష్టం లేకపోయినా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారు.
అయితే మీడియా తప్పుడు వార్తల వల్ల ఆ చిన్నారి తండ్రి ఆత్మహత్య చేసుకుంటారు.
ఆ స్కిట్ ను చూసిన సునీత కన్నీళ్లు పెట్టుకుంటూ స్టేజ్ పైకి వచ్చి ఈ స్కిట్ కు చాలా కనెక్ట్ అయ్యామని వెల్లడించారు.
మీకు మేము సెలబ్రిటీలు కావచ్చని కానీ సినిమాల్లో ఆడిపాడే బొమ్మలం కావచ్చని అమ్మనురా అంటూ సునీత ఎమోషనల్ అయ్యారు. ఆదివారం రోజున రాత్రి 8 గంటల సమయంలో ఈ షో ప్రసారం కానుంది.
యాంకర్ రవికి ఈ మధ్య కాలంలో ఆఫర్లు తగ్గిన సంగతి తెలిసిందే.
ఈ షోకు ప్రదీప్ యాంకర్ కాగా ప్రదీప్ కు బదులుగా రవి వచ్చారు.దీంతో ప్రదీప్ కు కరోనా సోకిందని కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తుండటం గమనార్హం.అయితే వైరల్ అవుతున్న వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.
ప్రదీప్ కరోనా నిర్ధారణ అయినట్టు వార్తల గురించి ఇప్పటివరకు స్పందించలేదు.