రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.వందల సంఖ్యలో పాటలు పాడి, ఎంతోమంది హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పి కొత్త సింగర్ల నుంచి పోటీ ఎదురవుతున్నా సునీత అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు.
సినిమాలలో నటించే అవకాశాలు వచ్చినా ఆ ఆఫర్లకు సింగర్ సునీత నో చెప్పారు.ఈ ఏడాది సింగర్ సునీత ప్రముఖ బిజినెస్ మేన్ రామ్ వీరపనేనిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
స్టార్ హీరోయిన్లతో సమానంగా క్రేజ్ ఉన్న సునీత సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను కొనసాగిస్తూనే పలు రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు.అయితే తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో సునీత భర్తతో కలిసి వ్యాపారాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
రామ్ వీరపనేని, సునీతతో కలిసి వెబ్ సిరీస్ లు నిర్మించే ప్లాన్ చేస్తున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతుండటం గమనార్హం.
త్వరలో ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని ప్రచారం జరుగుతుండగా ఈ వార్తలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.కొత్త టాలెంట్ ను ప్రోత్సహించే ఉద్దేశంతో సునీత, రామ్ వీరపనేని ఈ వెబ్ సిరీస్ లకు నిర్మాతలుగా వ్యవహరించనున్నారని సమాచారం.సునీత పాడుతా తీయగా అనే ప్రోగ్రామ్ కు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించనున్నారని తెలుస్తోంది.
సునీత సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు.
గతేడాది నుంచి వెబ్ సిరీస్ లకు ప్రేక్షకుల నుంచి ఊహించని స్థాయిలో ఆదరణ దక్కుతున్న సంగతి తెలిసిందే.యూట్యూబ్ లో కొన్ని వెబ్ సిరీస్ లకు మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి.ఇలాంటి సమయంలో వెబ్ సిరీస్ లను నిర్మిస్తే ఆ వెబ్ సిరీస్ ల ద్వారా సక్సెస్ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.