తన మధురమైన స్వరంతో ఎన్నో అద్భుతమైన పాటలు పాడి ఎంతో మందిని ఆకట్టుకున్న సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఆమె పాడిన పాటలు వింటే మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది.
తన పాటలతో అందరిని మంత్ర ముగ్ధుల్ని చేస్తారు.తన వృత్తి పరంగా ఎంతో అంకితభావంతో పనిచేస్తున్న సింగర్ సునీత ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.
నాలుగు పదుల వయసు దాటాక ఆమె రెండవ పెళ్లి చేసుకోవడం పై సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.తన మొదటి భర్త నుంచి విడాకులు తీసుకున్న సునీత ప్రస్తుతం మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేనితో రెండో పెళ్ళికి సిద్ధమైన సంగతి మనకు తెలిసిందే.
గత కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లో లగ్జరీ హోటల్లో కేవలం సన్నిహితులని పిలిచి పార్టీ ఇచ్చారు.ఈ పార్టీలో ప్రముఖ యాంకర్ సుమ, రేణు దేశాయ్, నితిన్ పాల్గొన్నారు.
సునీత తన కాబోయే భర్త రామ్ తో కలసి కేక్ కట్ చేసి సింపుల్ గా వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు.అయితే ఈసారి సునీత వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ను భారీగా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది ఇందులో భాగంగానే ప్రీ వెడ్డింగ్ వేడుకకు ఎంతో ఘనంగా ఏర్పాటు చేయడమే కాకుండా, ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఆహ్వాన పత్రికలను కూడా ప్రచురించారు.
డిసెంబర్ 26 న సాయంత్రం 7 :30 నిమిషాలకు ప్రారంభమయ్యే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కు అందరూ రావాలంటూ ఆమె ఆహ్వానించారు.చిత్ర పరిశ్రమ నుంచి పెద్ద ఎత్తున సెలబ్రిటీస్ ఈ వేడుకకు హాజరు కానున్నారని తెలియజేశారు.అయితే సునీత తన మొదటి భర్తకిరణ్ కుమార్ గోపరాజుతో విడాకులు తీసుకున్న తర్వాత రెండో పెళ్లికి సిద్దం అయ్యారు.అంతేకాకుండా సునీతకు ఇద్దరు టీనేజ్ పిల్లలు ఉన్నారన్న విషయం కూడా మనకు తెలిసిందే.26న జరిగే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరగగా, వచ్చే ఏడాది జనవరిలో వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం.