ఇండియన్ మ్యూజిక్ నెంబర్ వన్ ఏ.ఆర్.రెహమాన్ సంగీత దర్శకుడుగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే.ఏకంగా ఇండియా తరుపున బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా హాలీవుడ్ మూవీకి గాను రెండు ఆస్కార్ అవార్డులు అందుకున్నాడు.
ఈ ఫీట్ లో భవిష్యత్తులో ఏ మ్యూజిక్ డైరెక్టర్ అందుకోలేకపోవచ్చు.ఇదిలా ఉంటే రీసెంట్ గా రెహమాన్ రచయితగా మారి కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ 99 సాంగ్స్ అనే సినిమాని సొంతంగా నిర్మించాడు.
ఈ మూవీ రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ ద్వారా డిజిటల్ లో రిలీజ్ అయ్యింది.సంగీత ప్రియులని ఈ మూవీ విశేషంగా ఆకట్టుకుంటుంది.నెట్ ఫ్లిక్స్ లో మంచి పాజిటివ్ టాక్ తో 99 సాంగ్స్ ఆకట్టుకుతుంది.
ఈ మూవీకి విమర్శకుల ప్రశంసల నుంచి సెలబ్రిటీల అభినందనల వరకు వచ్చాయి.
ఇదిలా ఉంటే ఈ మూవీని సీనియర్ గాయని పి సుశీల చూసి ఏ.ఆర్.రెహమాన్ ని ప్రత్యేకంగా అభినందించడంతో పాటు అవకాశం ఉంటే తన బయోపిక్ కూడా ఈ తరహాలో తెరకెక్కించాలని కోరినట్లు స్వయంగా రెహమాన్ పేర్కొన్నారు. మరి నిర్మాతగా, రచయితగా మారి మొదటి సినిమాతోనే మెప్పించిన ఏ.
ఆర్.రెహమాన్ ఆమె కోరినట్లు తన రెండో సినిమాని మ్యూజిక్ బ్యాగ్రౌండ్ లో పి.సుశీల బయోపిక్ ని తెరపై ఆవిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.అయితే ఈ మూవీని హిందీలో కాకుండా సౌత్ బాషలలో తెరకెక్కించే అవకాశం ఉంది.
మరి దీనిపై లాక్ డౌన్ తర్వాత ఏమైనా ప్రకటన చేసే అవకాశం ఉందేమో చూడాలి.