బాలీవుడ్ స్టార్ సింగర్ కనికా కపూర్
కు
కరోనా పాజిటివ్
అని తేలిన విషయం తెల్సిందే.ఈ నెల 9 న లండన్ వెళ్లిన ఆమె 14 న లక్నో కు వచ్చారు.
అయితే ఆ సమయంలో ఆమెకు జ్వరం ఉన్నట్లు తేల్చిన అధికారులు జాగ్రత్తలు వహించాలి అంటూ సూచించారు.అయినప్పటికీ ఆమె అవేమి పట్టించుకోకుండా పార్టీలు,ఫంక్షన్లు అంటూ మొత్తం తిరిగారు.
అయితే
కరోనా లక్షణాలు
ఉన్నాయన్న విషయం తెలిసినా ఆ విషయాన్నీ బయటకు చెప్పకుండా ఆమె వ్యవహరించిన తీరుపై అందరూ మండిపడ్డారు.ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలడం తో ప్రస్తుతం ఆమె
ఉత్తరప్రదేశ్
లోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో చికిత్స పొందుతున్నారు.
అయితే ఇప్పటికే మూడు సార్లు కరోనా పరీక్షలు నిర్వహించగా ఆమెకు పాజిటివ్ అనే తేలింది. తాజాగా నాలుగోసారి కూడా ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించగా నాలుగోసారి కూడా ఆమె కు పాజిటివ్ రావడం తో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
అయితే గత 10 రోజుల నుంచి చికిత్స తీసుకుంటున్నప్పటికీ కూడా ఆమె ఆరోగ్యం మెరుగవకపోవడం గమనార్హం.ఆమెకు కరోనా లక్షణాలు ఉన్నాయనే విషయం తెలిసి కూడా దాన్ని దాచిపెట్టి ఆమె పార్టీ లు నిర్వహించి రాజకీయ ప్రముఖులను సైతం ఆహ్వానించింది.
దీనితో ఆమెకు కరోనా ఉన్నట్లు తెలిసినా కూడా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తన ప్రాణాలతో పాటు ఎంతో మంది ప్రాణాలను రిస్కులోకి నెట్టిన ఆమె బాధ్యతారహితంపై ఆగ్రహాలు వెల్లువెత్తుతున్నాయి.
సెలబ్రెటీలు, డబ్బులు ఉంటే సరిపోదు బాధ్యత కూడా ఉండాలని హితవు పలుకుతున్నారు.కాగా, కనిక పాల్గొన్న పార్టీలో రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే, ఆమె కొడుకు తో పలువురు రాజకీయ ప్రముఖులతో పాటు
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే.దీనితో వారందరికీ కూడా కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ రావడం తో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.