బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ కు ఎట్టకేలకు కరోనా నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది.గతంలో నాలుగు సార్లు కరోనా పరీక్షలు నిర్వహించగా అన్ని సార్లు కూడా పాజిటివ్ రావడం తో కనికా కుటుంబసభ్యులు ఆందోళన చెందారు.
అయితే ఇప్పుడు తాజాగా ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ రావడం తో వారంతా ఊపిరి పీల్చుకున్నారు.కనికా కపూర్కు మార్చి 20న తొలిసారి నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగిటివ్ వచ్చింది. ఆ తర్వాత మార్చి 29న నాలుగోసారి ఆమెకు కరోనా పాజిటివ్ వచ్చింది.ఆమెకు కరోనా వచ్చి ఉంటుందన్న అనుమానంతో ఇంట్లోనే ఉండాల్సిందిగా సంబంధింత అధికారులు సూచించినా, పట్టించుకోకుండా పలు హైఫై పార్టీలకు హాజరుకావడంతో ఆమె మీద పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే నాలుగు సార్లు కరోనా టెస్ట్ లు నిర్వహించినప్పటికీ ఆమె కు ప్రతిసారి పాజిటివ్ రావడం తో అందరూ ఆందోళన చెందారు.అయితే వైద్యులు మాత్రం ఎలాంటి అపాయం లేదని, పరిస్థితులు నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
అయితే తాజాగా మరోసారి టెస్ట్ లు నిర్వహించగా నెగిటివ్ రావడం తో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
అయితే మరోసారి కూడా పరీక్షలు నిర్వహించినప్పుడు నెగిటివ్ వచ్చే వరకు ఆమెకు లక్నోలోని పీజీఐ ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తాం అని వైద్యులు తెలిపారు.గతంలో పలుమార్లు జరిగిన టెస్ట్లో పాజిటివ్ రాగా.ఆమె కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు.
అయితే తాజా రిపోర్టులో నెగిటివ్ రావడంతో.సింగర్తో పాటు ఫ్యామిలీ మెంబర్లు, ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.
కానీ తదుపరి రిపోర్ట్ వచ్చే వరకు ఆమెను అబ్జర్వేషన్లోనే ఉంచబోతున్నట్లు వైద్యులు వెల్లడించారు.