తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రముఖ సింగర్ చిన్మయి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమె కెరిర్ పరంగా దూసుకుపోతూనే సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది.
సమాజంలో జరుగుతున్న విషయాల గురించి మహిళల గురించి, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు విషయాల గురించి తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది.కొన్ని కొన్ని సార్లు కొన్ని అంశాలపై స్పందిస్తూ వివాదాలను సైతం ఎదుర్కొంటూ ఉంటుంది.
ఇక సోషల్ మీడియా ద్వారా తమ బాధలను చెప్పుకుని బాధపడే అమ్మాయిలకు సలహాలు సూచనలు ఇస్తూ ధైర్యం చెబుతూ ఉంటుంది.
అదే విధంగా తన పై రూమర్స్ సృష్టిస్తూ, తనపై ట్రోలింగ్స్ చేసేవారికి తనదైన శైలిలో ఘాటుగా సమాధానం ఇస్తూ ఉంటుంది.ఇదిలా ఉంటే మలయాళ సినీ పరిశ్రమలో ప్రముఖ హీరోయిన్ కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసు సంచలనం రేపుతున్న విషయం మనందరికి తెలిసిందే.2017 లో జరిగిన ఆ ఘటనపై ఇప్పటికి ఎంతో మంది హీరోయిన్లు ప్రేమికులు బాధిత హీరోయిన్ కు మద్దతుగా నిలుస్తున్నారు.వారిలో మలయాళ ప్రముఖ నటి పార్వతి తిరువోత్ కూడా ఒకరు.ఈ ఘటన తర్వాత మహిళా సంఘాలతో కలిసి పార్వతి ఒక పోరాటం చేశారు.కానీ అది మధ్యలోనే ఆగిపోయింది.
అయితే ఆ పోరాటం వల్ల తాను ఏం కోల్పోవాల్సి వచ్చిందో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది పార్వతి.ఇక ఆ మాటలు విన్న చిన్మయి ఆగ్రహం వ్యక్తం చేసింది.నిజాలు మాట్లాడినందుకు పార్వతి వంటి ఒక మంచి నటి తన పనిని కోల్పోయింది.
లైంగిక వేధింపుల నుంచి తప్పించుకున్న వారి తరఫున మాట్లాడటం వల్ల తన పనిని కోల్పోయింది అని చెప్పడం నిజం.ఈ విషయంలో చాలా మంది మహిళలు మౌనంగా ఉన్నారు.
రేపిస్టులను మాత్రమే సమాజం ప్రేమిస్తుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూచిన్మయి ట్వీట్ చేసింది.ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.