తెలుగు సినిమా ఇండస్ట్రీలో సింగర్ గా,డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సింగర్ చిన్మయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ఈమె మీటూ ఉద్యమం ద్వారా మహిళలపై జరుగుతున్న అరాచకాలను బయటపెట్టి పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచింది.
ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ సమాజంలో మహిళలపై జరుగుతున్న అరాచకాలు గురించి ప్రశ్నిస్తుంది.
ఇప్పటికే సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడుల గురించి సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఈమెను తీవ్రస్థాయిలో నెటిజన్లు ట్రోల్ చేస్తుంటారు.
ఈ క్రమంలోనే చిన్మయి సెక్స్ వర్కర్ల గురించి సంచలనమైన పోస్ట్ లు పెడుతూ అలాంటి వారితో పని చేయించుకుంటున్న మగాళ్ళని ఏమని పిలవాలి అంటూ ప్రశ్నించింది.ఇలా మగాళ్లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన చిన్మయి yy తాజాగా మరొకసారి సంచలనమైన పోస్టు ద్వారా వార్తల్లో నిలిచారు.
ఈ సందర్భంగా ఈమె ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ సందర్భంగా ఈమె పోస్ట్ చేస్తూ ఒకే గదిలో ఉండే ఆడవాళ్ళ అందరితో మగాడికి ఎంతో స్వర్గం ఉంటుంది.మరి మగాళ్ళ అందరితో ఆడదానికి నరకం అంటూ చేసిన పోస్ట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.ఈ పోస్టులు చూసిన కొందరు నెటిజన్లు ఈమెపై పెద్దఎత్తున ట్రోలింగ్ చేస్తున్నారు.
అయితే ఈ విధమైనటువంటి ట్రోలింగ్స్ చిన్మయికి కొత్త కాదని చెప్పవచ్చు.