కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ఐశ్వర్య జంట విడాకులు తీసుకున్నట్లు ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే.సాధారణంగా సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకోవడం విడిపోవడం సర్వసాధారణమై పోయాయని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే వీరి విడాకుల గురించి నెటిజన్ స్పందిస్తూ తనదైనశైలిలో కామెంట్ చేశాడు.ఏది ఏమైనా మన తల్లిదండ్రులు చాలా గ్రేట్.
ఎన్ని సమస్యలు ఉన్నా అడ్జస్ట్ అవుతా బతుకుతున్నారు.కానీ సినిమా వాళ్ళు అలా కాదు ఎంత డబ్బు ఉన్న ఉపయోగం లేదు అంటూ కామెంట్ చేశాడు.
ఇక ఈ కామెంట్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి దృష్టికి వెళ్ళింది.దీంతో ఈమె ఓ రేంజ్ లో రెచ్చిపోయి సదరు నెటిజన్లకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఈమె కామెంట్ చేస్తూ డబ్బు ఉన్నా లేకపోయినా తల్లిదండ్రులు ఉన్నారా గ్రేట్ అంటూ కామెంట్ చేశారు.ఒక జంట కలిసి ఉండాలా లేదా అనేది డబ్బుకు సంబంధించిన విషయం కాదు.
ఇప్పటికీ మీ ఇంటిలో ఉన్న తల్లిదండ్రులను వెళ్లి అడగండి సంతోషంగా ఉన్నారా అని ప్రశ్నిస్తే ఈ జన్మకు ఇలా రాసిపెట్టి ఉంది అందుకే అలా సర్దుకుపోతారే తప్ప సంతోషంగా ఉన్నట్లు చెప్పరు.
ఎంతోమంది తల్లులు ఈ సమాజం కోసం భర్త చేతిలో దెబ్బలు తింటూ తాగుడుకు బానిసైన భర్తను భరిస్తూ తనకు తెలియకుండా డబ్బులు దాచి పిల్లలను పెంచి పోషిస్తుంది.ఇలా పిల్లల కోసం చాలామంది తల్లిదండ్రులు ఒకరినొకరు భరించుకుంటున్నారు.నిజంగా ఇది విచారకరం అంటూ తనదైన శైలిలో సమాధానం చెప్పారు.