సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో చిన్మయి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.స్టార్ హీరోయిన్ సమంత సినిమాలకు డబ్బింగ్ చెప్పడం ద్వారా చిన్మయికి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరు వచ్చింది.
తాజాగా నేర్కొండ పార్వాయి సినిమా చూసిన చిన్మయి ఆ సినిమా గురించి సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతోన్న వకీల్ సాబ్ సినిమా పింక్ కు రీమేక్ కాగా ఈ సినిమా తమిళంలో నేర్కొండ పార్వాయి పేరుతో తెరకెక్కింది.
తనకు నేర్కొండ పార్వాయి లాంటి సినిమాలు చూడాలంటే భయమని.తాను పెద్దగా సినిమాలు చూడనని.సినిమాల్లో కూడా సంతోషాన్ని పంచే, సరదాగా సాగిపోయే సినిమాలంటేనే తాను ఎక్కువగా ఇష్టపడతానని పేర్కొన్నారు.ఎమోషన్స్ కు, భావోద్వేగాలకు, హింసకు ప్రాధాన్యత ఉండే సినిమాలు తనకు పెద్దగా నచ్చవని తాను మొదట నేర్కొండ పార్వాయి సినిమా కూడా అలాంటి సినిమానే అని భావించానని పేర్కొన్నారు.
అయితే నేర్కొండ పార్వాయి సినిమా చూడాలంటే భయం వేసినా ధైర్యం తెచ్చుకుని సినిమా చూశానని.సినిమా చూసిన తరువాత ఈ సినిమాపై ఒక మంచి సినిమా చూశానని అనిపించిందని సినిమా ఎంతగానో నచ్చిందని తెలిపారు.
అజిత్ లాంటి స్టార్ హీరో ఇలాంటి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలలో నటించడానికి అంగీకరించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని.స్టార్లు సందేశం ఉన్న సినిమాల్లో ప్రేక్షకుల్లో కూడా ఆలోచన మొదలవుతుందని తెలిపారు.
పింక్ రీమేక్ తెలుగులో పవన్ హీరోగా తెరకెక్కుతోందని.తెలుగులో పవన్ లాంటి హీరో ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి అంగీకరించడం ఎంతో సంతోషంగా ఉందని చిన్మయి తెలిపారు.బ్రోచేవారెవరురా, డియర్ కామ్రేడ్, నేర్కొండ పార్వాయి లాంటి సినిమాల డైరెక్టర్లు, రైటర్లను చూసి తాను గర్వపడుతున్నానని చిన్మయి చెప్పారు.