సినిమా ఇండస్ట్రీలో హీరోహీరోయిన్లు వరుస అవకాశాలతో బిజీగా ఉండడం వల్ల ఆలస్యంగా పెళ్లి చేసుకోవాలని భావిస్తూ ఉంటారు.అయితే కరోనా వైరస్ విజృంణ, లాక్ డౌన్ వల్ల చాలామంది హీరోహీరోయిన్ల కెరీర్ లో గ్యాప్ వచ్చింది.
ప్రభాస్ నటించిన రాఘవేంద్ర సినిమాలో ప్రభాస్ కు జోడీగా నటించిన శ్వేతా అగర్వాల్ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.స్టార్ సింగర్ ఉదిత్ నారాయణ్ కుమారుడు ఆదిత్య నారాయణ్ ను శ్వేతా అగర్వాల్ వివాహం చేసుకోనుంది. చాలా సంవత్సరాల నుంచి వీళ్లిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు.వీళ్లిద్దరి బంధం గురించి అనేక వార్తలు వైరల్ అయ్యాయి.గతంలో ఒకరిపై ఒకరికి ఎంత ఇష్టం ఉన్నా వెల్లడించని ఆదిత్య నారాయణ్ శ్వేతా అగర్వాల్ వివాహం చేసుకోబోతున్నట్టు ప్రకటన చేసి అభిమానులను ఆశ్చర్యపరిచారు.ఆదిత్యా నారాయణ్ సింగర్ గా మాత్రమే కాకుండా నటుడిగా, హోస్ట్ గా తన ప్రతిభను చాటుకుంటున్నారు.
డిసెంబర్ నెలలో వీరి వివాహం జరగనుందని సమాచారం.కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో డిసెంబర్ నాటికి వైరస్ పూర్తిగా అదుపులోకి వస్తే బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా వివాహం చేసుకుందామని ఈ జంట భావిస్తోంది.
ఆదిత్య నారాయణ్ బాలనటుడిగా, హీరోగా పలు సినిమాల్లో నటించాడు.ఒక సినిమా షూటింగ్ సమయంలో ఆదిత్య నారాయణ్ కు శ్వేతా అగర్వాల్ పరిచయం కాగా ఆ పరిచయం కాస్తా ప్రేమ బంధంగా మారింది.
కెరీర్ పరంగా వరుస అవకాశాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో శ్వేతా అగర్వాల్, ఆదిత్య నారాయణ్ పెళ్లిని వాయిదా వేసుకుంటూ వచ్చారు.కరోనా, లాక్ డౌన్ వల్ల కొంత గ్యాప్ రావడంతో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్టు కీలక ప్రకటన చేశారు.
ఈ ఏడాది టాలీవుడ్ హీరోలు నిఖిల్, నితిన్ పెళ్లిళ్లు చేసుకోగా అక్టోబర్ 30వ తేదీన కాజల్ వివాహం జరగనున్న సంగతి తెలిసిందే.