ఒకప్పుడు మన తాతలు 60, 70 ఏళ్ల వరకు కూడా కాయ కష్టం చేసిన వారే.కొందరైతే 100 ఏళ్ల వరకు బతికి, బతికి ఉన్నంత కాలం వ్యవసాయ పనులు చేసినట్లుగా మనం వింటూనే ఉంటాం.
కాని ప్రస్తుత పరిస్థితి పూర్తిగా మారింది.అయిదు పదుల వయసు వచ్చింది అంటూ నడుము నొప్పి, మోకాళ్ల నొప్పి, ఇంకేవో నొప్పులు అంటూ ఏ పని చేతనవ్వడం లేదు అంటూ పడుకుంటున్నారు.
అలాగే మొహం కూడా అయిదు పదుల వయసు రాగానే వృద్దాప్యంలోకి మారిపోతుంది.ఆరు పదుల వయసుకు వచ్చేప్పటికి అంతా వృద్దులం అయిపోతాం.
మనిషి మరణంను జయించేందుకు.వృద్దాప్యంను జయించేందుకు ఎన్నో ఏళ్లుగా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు.ఎన్నో ప్రయోగాలు చేసిన తర్వాత సింగపూర్కు చెందిన ఒక యూనివర్శిటీ శాస్త్రవేత్తలు అద్బుతమైన విషయాన్ని కనిపెట్టారు.ఎలుకలపై చేసిన ప్రయోగంలో వృదాప్యం దరి చేరకుండా ఎలా చేయాలో శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఎలుకపై ప్రయోగించిన పద్దతిని మనుషులు కూడా వాడితే ఖచ్చితంగా వృదాప్యంను పది నుండి 20 ఏళ్ల వరకు రాకుండా చూసుకోవచ్చు అంటున్నారు.
మానవ శరీరంలో ఎన్నో గ్రంధులు ఉంటాయి.ఒక్కో గ్రంధీ ఒక్కో విధంగా పని చేస్తాయి.అలా బ్యూటిరేట్ గ్రంధీ అని ఒకటి ఉంటుంది.
ఈ గ్రంధీ మనిషి శరీరం పటిష్టంగా ఉండటంతో పాటు వృద్దాప్య చాయలు రాకుండా ఉండేలా చేస్తుంది.కొందరు పిల్లలు యువకులు కూడా ముసలి వారిగా కనిపిస్తారు.
అలాంటి వారిలో బ్యూటిరేట్ గ్రంధీ సరిగా పని చేయడం లేదని అర్థం చేసుకోవచ్చు.వయసు పెరుగుతున్నా కొద్ది ఈ బ్యూటిరేట్ గ్రంధి పనితనం తగ్గుతుంది.
ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన తర్వాత నుండి 60 ఏళ్ల వరకు మెల్ల మెల్లగా పని చేయడం ఆగిపోతుంది.
బ్యూటిరేట్ గ్రంధిని కరెక్ట్గా కాపాడుకోగలిగితే 80 ఏళ్లు వచ్చే వరకు కూడా శక్తివంతంగా ముసలి వాళ్లం కాకుండా బతికేయవచ్చు అంటా.మనం తినే ఆహారం ద్వారా ఆ గ్రంధిని కాపాడుకోవచ్చు అంటూ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ప్రస్తుతం ఇంకా డెప్త్గా పరిశోదనలు జరుగుతున్నాయి.
అవి సక్సెస్ అయ్యి ఆ గ్రంధీని మనం బయట నుండి కూడా ఆరోగ్యంగా ఉంచుకునేలా ప్రయత్నాలు చేయగలిగితే సూపర్ అంటూ వైధ్యులు అంటున్నారు.