ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వేగంగా తన ప్రభావాన్ని చూపుతోంది.ఇప్పటివరకు కరోనా వార్తలు లేని సింగపూర్ రోజులు గడిచేకొద్దీ కరోనా బాధితుల వార్తల్లో నిలుస్తోంది.
కేవలం ఒక్కరోజులో 120 కేసులు నమోదు కాగా ఇప్పటివరకు సింగపూర్ వ్యాప్తంగా 1309 మందికి కరోనా సోకినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది దాంతో సింగపూర్ ప్రజలందరూ ఆందోళన చెందుతున్నారు.ఇదిలా ఉంటే
సింగపూర్ లో తాజాగా నమోదైన కేసులలో ఏడుగురు భారతీయులు కూడా ఉన్నట్లుగా అధికారులు ప్రకటించారు.
ఇప్పటివరకు నమోదైన కరోనా కేసులలో భారతీయులు లేరని, నిన్నటి రోజున ఒకేసారి వచ్చిన 120 కేసులలో ఏడుగురు భారతీయులు ఉన్నారని వీరందరూ 18 ఇది ఏళ్ల నుంచి 55 ఏళ్లు లోపు వారిని అధికారులు ప్రకటించారు.అయితే వీరందరూ వర్క్ పాస్ పై సింగపూర్ లో ఉన్నట్లుగా తెలిపారు.
కొత్తగా నమోదైన కేసులు అన్నిటిలో అధికశాతం విదేశాల నుంచి వచ్చిన వారికే సోకిందని అధికారులు చెబుతున్నారు.అయితే నిన్నటి రోజున సుమారు 23 మందిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశామని, వీరితో కలిపి మొత్తం 320 మంది పూర్తిగా కోరుకున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది.ఈ పరిణామాలతో ఒక్కసారిగా సింగపూర్ ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది.విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు సేకరించి 14 రోజులపాటు క్వారంటైన్ లో ఉంచాలని ఆదేశించింది.
ఒక్క సారిగా భారతీయుల కేసులు 7 నమోదు కావడంతో స్థానికంగా ఉన్న ఎన్నారైలు అలెర్ట్ అయ్యారు…
.