హిందీలో టబు, ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే కాంబినేషన్ లో వచ్చి సూపర్ హిట్ అయిన సినిమా అంధాదున్.ఈ సినిమాతో నటి టబు నేషనల్ అవార్డు సైతం గెలుచుకుంది.
సినిమా కూడా బాలీవుడ్ ఉత్తమ చిత్రాల జాబితాలో చేరడంతో పాటు అవార్డులు గెలుచుకుంది.ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాని సౌత్ భాషలలో రీమేక్ చేస్తున్నారు.
తెలుగులో నితిన్ హీరోగా నభా నటేష్, తమన్నా కాంబినేషన్ లో తెరకెక్కుతుంది.తాజాగా దుబాయ్ లో ఈ సినిమా షూటింగ్ కూడా దర్శకుడు మేర్లపాక స్టార్ట్ చేశాడు.
తమన్నా ఇందులో హిందీలో టబు చేసిన నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతుంది.ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా తమిళ్ రీమేక్ కి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది.
తమిళంలో హీరో ప్రశాంత్ ఇందులో మెయిన్ లీడ్ చేస్తున్నాడు.అతని తండ్రి సినిమాని నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.వచ్చే ఏడాది సెట్స్ పైకి తీసుకొని వెళ్ళడానికి రెడీ అవుతున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో వెటరన్ స్టార్ హీరోయిన్ సిమ్రాన్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతుంది.ఇప్పటికే సిమ్రాన్ తన సెకండ్ ఇన్నింగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్టార్ట్ చేసింది.
శివ కార్తికేయన్ సీమ రాజా సినిమాలో విలన్ గా నటించి మెప్పించింది.ఇప్పుడు స్టైలిష్ విలన్ గా అంధాదున్ రీమేక్ లో సిమ్రాన్ కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.
గతంలో ఐశ్వర్యా రాయ్ పేరు వినిపించిన ఆమె మణిరత్నం పాన్ ఇండియా సినిమాకి డేట్స్ ఇచ్చేయడంతో ఈ సినిమా చేయలేకపోతోంది.దీంతో ఆ ప్లేస్ లోకి సిమ్రాన్ ని తీసుకున్నారు.