బాలయ్య-బోయపాటి కాంబినేషన్ లో మూడో సినిమాకి రంగం సిద్ధం అయినా సంగతి తెలిసిందే.ఈ సినిమా ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొని షూటింగ్ కి సిద్ధమవుతోంది.
గతంలో షూటింగ్ స్టార్ట్ అయినా కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడింది అయిత్ త్వరలో సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలని షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు.ఇందులో మరోసారి బాలయ్య ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నాడు.
అందులో ఒక పాత్రలో అఘోరాగా కనిపిస్తాడని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది.మరో పాత్రలో రైతు పాత్ర అని తెలుస్తుంది.
ఈ రైతు పాత్ర కాస్తా ఏజ్ లో ఉంటుందని సమాచారం.ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్స్ గురించి చాలా రోజులుగా చర్చ నడుస్తుంది.
అయితే ఇప్పటికే హీరోయిన్స్ ఎవరనేది కన్ఫర్మ్ అయ్యారని అయితే మంచి సమయం చూసుకొని వారిని పరిచయం చేస్తామని బోయపాటి చెప్పారు.ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి మరో ఆసక్తికరమైన వార్త ఇప్పుడు వినిపిస్తుంది.
బాలయ్య కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ మూవీస్ గా సమరసింహారెడ్డి, నరసింహానాయుడు సినిమాలు నిలిచిపోతాయి.ఆ సినిమాలలో బాలకృష్ణకి జోడీగా సిమ్రాన్ వీరిద్దరి కాంబినేషన్ లో తరువాత కూడా సినిమాలు వచ్చాయి.
దీంతో బాలకృష్ణ, సిమ్రాన్ కాంబినేషన్ కి మంచి క్రేజ్ ఉంది.ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం సిమ్రాన్ ని ఫైనల్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది.
ఈ క్రేజీ కాంబినేషన్ కి ఫ్యాన్స్ లో మంచి హైప్ ఉంటుంది కాబట్టి సిమ్రాన్ ని ఎంపిక చేసినట్లు టాక్.అయితే ఇందులో సిమ్రాన్ పాత్ర ఈ సారి బాలయ్యకి యాంటీగా పవర్ ఫుల్ నెగిటివ్ రోల్ లో ఉంటుందని సమాచారం.
గతంలో బాలయ్యతో రొమాన్స్ చేసిన సిమ్రాన్ ని ఇందులో బాలకృష్ణని ఎదుర్కొనే ప్రతినాయికగా చూపిస్తే బాగుంటుందని బోయపాటి ఇలా ప్లాన్ చేసాడని సమాచారం.