కోలీవుడ్ హీరో శింబు ఒకేసారి 30 కిలోల బరువు తగ్గి గుర్తుపట్టలేనంతగా మారిపోయారు.తాజాగా హీరో శింబు ట్విట్టర్ ద్వారా ఆ ఫోటో షేర్ చేయడంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆ ఫోటో చూసిన నెటిజన్లు అసలు శింబుకి ఏమైంది? గుర్తుపట్టలేనంతగా మారిపోయారు.ఒక్కసారిగా ఇలా సన్నబడటానికి కారణం ఏంటని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
శింబు ఒకే సారి బరువు తగ్గడానికి గల కారణం తను నటిస్తున్నటువంటి సినిమా అని చెప్పవచ్చు.ప్రస్తుతం శింబు డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి ‘వెందు తానింధుడు కాదు‘అనే చిత్రంలో నటిస్తున్నారు.
తాజాగా ఈ చిత్రం నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకొని సినిమాపై అంచనాలను పెంచుతుంది.ఈ చిత్రంలో నటించడం కోసం శింబు ఏకంగా 30 కిలోల బరువు తగ్గినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే లేటెస్ట్గా తన ట్రాన్స్ఫర్మేషన్కు సంబంధించిన ఫోటోలు షేర్ చేయడంతో ఈ ఫోటో కాస్త వైరల్ గా మారింది.
ఇదివరకే దర్శకుడు గౌతమ్ మీనన్, హీరో శింబు కాంబినేషన్ లో “ఏం మాయ చేశావే”, “సాహసం శ్వాసగా సాగిపో” అనే చిత్రాలను తమిళ రీమేక్ వెర్షన్ లో నటించారు.ఈ రెండు చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్నటువంటి మూడో చిత్రంపై కూడా ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చగా సీనియర్ నటి రాధిక కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.