యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.వరుస విజయాలు సొంతం చేసుకుంటున్న ఎన్టీఆర్ హీరో కావడం, అల వైకుంఠపురములో సినిమా తరువాత త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తూ ఉండటంతో షూటింగ్ ప్రారంభం కాకముందే సినిమాపై భారీగా అంచానాలు నెలకొన్నాయి.
అయితే ఈ సినిమాలో విలన్ గా కోలీవుడ్ హీరో నటించనున్నాడని తెలుస్తోంది.
తమిళ హీరో శింబు ఈ సినిమాలో ఎన్టీఆర్ కు విలన్ గా నటిస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
అయితే అధికారిక ప్రకటన వెలువడితే మాత్రమే శింబు నిజంగా ఈ సినిమాలో నటిస్తున్నారో లేదో తెలిసే అవకాశాలు ఉన్నాయి.అయినను పోయిరావలె హస్తినకు అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కనుందని ప్రచారం జరుగుతోంది.
ఎన్టీఆర్ ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్లుగా పలువురు బాలీవుడ్ హీరోయిన్లతో పాటు పూజా హెగ్డే పేరు కూడా వినిపిస్తోంది.అయితే చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించే వరకు ఎదురు చూస్తే మాత్రమే వైరల్ అవుతున్న వార్తలో నిజానిజాలు తెలిసే అవకాశం ఉంటుంది.గతంలో త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత సినిమా హిట్ కావడంతో పాటు త్రివిక్రమ్ ఎన్టీఆర్ ను కొత్తగా చూపించారని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో ఆర్ఆర్ఆర్ మూవీలో నటిస్తున్న ఎన్టీఆర్ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు.ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ డబుల్ హ్యాట్రిక్ సాధిస్తాడని ఎన్టీఆర్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఈ ఏడాది అక్టోబర్ నెల 13వ తేదీన ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల కానుంది.జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో కొమురం భీం పాత్రలో నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు.