తాజాగా అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమం నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే.ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఘనంగా నిర్వహించారు.
ఈ భూమి పూజ కార్యక్రమంలో వెండి ఇటుకతో భూమి పూజ చేశారు.
అయితే ఈ కార్యక్రమంలో ఉపయోగించిన ఈ వెండి ఇటుకలు దాదాపు 22.6 కేజీల బరువు కలిగి ఉంది.ఇక ఈ ఇటుకను తయారు చేయడానికి ఎంత ఖర్చు అయ్యిందంటే… అక్షరాలా రూ.15 లక్షల 59 వేల రూపాయలు.అవును, మరి దశాబ్దాల కాలంనాటి నుండి నిర్మింప దలచిన ఆలయానికి ఆ మాత్రం భారీగా ఉండాల్సిందే మరి.ఆలయ నిర్మాణం మొత్తానికి కూడా రూ.300 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని, ఆలయ నిర్మాణం మొత్తం పూర్తి అవడానికి 3 సంవత్సరాల పైన సమయం పడుతుందని తెలుస్తోంది.
ఇక ఆలయ నిర్మాణం మొత్తం రెండు వేల ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం చేపట్టబోతున్నారు.అంతేకాకుండా రిక్టర్ స్కేల్ పై 10 తీవ్రతతో భూకంపం సంభవించిన కూడా ఆలయానికి ఎటువంటి ఆటంకం ఉండదని తెలుపుతున్నారు నిపుణులు.ఇక ఈ ఆలయ నిర్మాణం మొత్తం నార్త్ ఇండియన్ నగర శైలిలో చేపడుతున్నారు.ఇక ఈ ఆలయ నిర్మాణానికి ఆర్కిటెక్ట్ గా ప్రముఖ శిల్పి పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన చంద్రకాంత్ సోమపుర వ్యవహారాలు చేపడుతున్నారు.
ఈ ఆలయ నిర్మాణం మొత్తం మూడు అంతస్తులుగా 161 అడుగుల ఎత్తులో నిర్మాణం జరగబోతుంది.