తెలంగాణ రాజకీయాల్లో షర్మిల ఒక్కసారిగా ప్రవేశించి రాజకీయ వర్గాల్లో అలజడి సృష్టించిన విషయం తెలిసిందే.అయితే తెలంగాణ రాజకీయాల్లో రాణించగలదని షర్మిల కు ఉన్న ఏకైక నమ్మకం జగన్ జైలుకు వెళ్ళినప్పుడు తెలంగాణలో కూడా జగన్ కు మద్దతుగా పాదయాత్ర నిర్వహించడంతో ప్రజలకు తాను తెలుసుననే భ్రమలో ఉన్నారు.
ప్రజలు తమ కోసం ఎవరు పోరాడారో, ఎవరు మా పక్షాన నిలబడ్డారో ప్రజలు అన్నీ గుర్తుంచుకుంటారు.అయితే తాజాగా నిరుద్యోగులకు తక్షణమేన్ నోటిఫికేష లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ 72 గంటల నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.
అయితే రకరకాల విషయాలపై నిరాహార దీక్ష సమయంలో రకరకాలుగా విమర్శలు చేసిన షర్మిల ఆ దీక్ష విరమణ తరువాత మరల సైలెంట్ అయిన పరిస్థితి ఉంది.అయితే ఈ మౌనం వెనుక మరేదైనా సంచలనం దాగి ఉందా అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అయితే పీకేను రాజకీయ సలహాదారులుగా నియమించుకునే ఆలోచనలో ఉన్న షర్మిల పీకే వ్యూహాలను అమలు చేస్తూ ముందుకు సాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.అయితే ఇప్పటికే తనదైన శైలిలో దూసుకుపోతున్న షర్మిల కరోనా విజ్రుంభణ తరువాత ఇక పూర్తి స్థాయిలో పీకే వ్యూహాలను అమలు పరిచేందుకు షర్మిల తీవ్రంగా ప్రయత్నిస్తోంది.