ఈ కాలంలో చాలామంది సరదాగా ఫ్యామిలి తోనో, లేక ఫ్రెండ్స్ తోనే కలిసి బయటకి వెళ్లి రెస్టారెంట్ లలో తినడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు.అలా కుటుంబం లేదా ఫ్రెండ్స్ అందరితో కలిసి భోజనం చెయ్యడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది.
ఆ కొంచెం సేపు ఆనందం మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ తింటుంటే మనసుకు చాలా ప్రశాంతగా ఉంటుంది కదా.
కానీ, జపాన్ లో ఉన్న రెస్టారెంట్ లలో మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటుంది.ఆ దేశంలో విధించిన నిబంధనల ప్రకారం రెస్టారెంట్ లలో మాట్లాడుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటూ భోజం చెయ్యకూడదట.ఆలా చేస్తే వాళ్ళని తీసుకుని వెళ్లి ఏకంగా జైలుల్ పడేస్తారట.
వింటుంటే మీకే ఆశ్చర్యంగా ఉంది కదా.! కానీ మీరు విన్నది నిజమే.తినేటప్పుడు మాట్లాడితే మాత్రం కచ్చితంగా జైలు శిక్ష ఉంటుందట.
జపాన్ లోని రెస్టారెంట్ లలో ఈ నిబంధనలను చాలా కచ్చితంగా అమలు చేస్తున్నారు.ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వణికిస్తోంది.అందుకనే జపాన్ లో ఈ నిబంధనలను అమలులోకి తీసుకొచ్చారు.ఇప్పుడిప్పుడే కరోనా వలన మూతపడిన రెస్టారెంట్లు, స్కూల్ లు అన్నీ మళ్ళీ తిరిగి తెరుచుకుంటున్నాయి.ఈ క్రమంలో మళ్ళీ అందరు యధావిధిగా రోడ్ల మీద తిరిగి, మాస్క్ లేకుండా మాట్లాడుకుంటుంటే మళ్ళీ కరోనా వైరస్ యధావిధిగా వ్యాప్తి చెందుతుంది.
అందుకనే రెస్టారెంట్ లలో తింటూ మాట్లాడితే నేరం కింద పరిగణలోకి తీసుకుంటున్నారు.
మాట్లాడుతూ తినడం వలన కరోనా చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందని జపాన్ ప్రభుత్వం అభిప్రాయపడుతోంది.అందుకే జపాన్ ప్రభుత్వం ప్రజలను తినేటప్పుడు మాట్లాడకూడదు అని కొన్ని నిబంధనలను పెట్టింది.అలాగే అక్కడి రెస్టారెంట్ లను రాత్రి 8 గంటలకే మూసివేయాలని జపాన్ ప్రభుత్వం రెస్టారెంట్ లకు ఆదేశాలు కూడా జారీ చేసింది.
ఒకవేళ రెస్టారెంట్ లో గనక తింటూ మాట్లాడితే మాత్రం జైలుకు వెళ్లడం ఖాయం.అలాగే ఆ ప్రభుత్వం నిబంధనలకు వ్యతిరేకంగా రాత్రి 8 గంటలకన్నా ఎక్కువ సేపు రెస్టారెంట్ తెరిచి ఉన్నగాని జైలులో ఊచలు లెక్కపెట్టాలిసిందే.!
.