యూకేలోని మాంచెస్టర్లో ఈ ఏడాది జూన్ నెలలో సిక్కు మతగురువుపై దాడి చేసిన ఘటనకు సంబంధించి ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.నాటి ఘటనలో 62 ఏళ్ల బాధితుడి మెదడుకు తీవ్ర గాయమైందని మీడియాలో కథనాలు చెబుతున్నాయి.28 ఏళ్ల యువకుడిని బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు.ప్రజల సహకారంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు.
అతని కారణంగా బాధితుడి కుటుంబానికి జీవితాన్ని మార్చే గాయాలు కలిగాయన్నారు.
జూన్ 23, 2022 గురువారం సాయంత్రం 6.30 గంటలకు మాంచెస్టర్ సిటీలోని టిబ్ స్ట్రీట్ రోడ్డులో అపస్మారక స్థితిలో పడివున్న వ్యక్తిని నార్త్ వెస్ట్ అంబులెన్స్ సర్వీస్ ద్వారా అధికారులు ఆసుపత్రికి తరలించారు.హిల్టన్ స్ట్రీట్ జంక్షన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి బాధితుడిపై దాడికి తెగబడినట్లు సీసీటీవీ ఫుటేజ్లో తేలింది.
నిందితుడు ఘటనాస్థలి నుంచి నడుచుకుంటూ ఓల్డ్హామ్ స్ట్రీట్లో ఎడమవైపుకు పారిపోయినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు నిర్థారణకు వచ్చారు.
లాంగ్సైట్ సీఐడీకి చెందిన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ మార్క్ ఆస్ట్బరీ మీడియాతో మాట్లాడుతూ.నేరస్థుడిని కనుగొనేందుకు కుటుంబ సభ్యుల అనుమతితో సీసీటీవీ ఫుటేజ్ని విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.మునుపటి ప్రకటనలో బాధితుడి కుటుంబం గత వారం సిక్కు పూజారిపై దుండగులు దాడి చేయడంతో అతని జీవితం విషాదకరంగా మారిపోయిందన్నారు.
తమకే ఇలా జరుగుతుందని ఊహించలేకపోయామని కుటుంబ సభ్యులు వెల్లడించారు.ఆయన మెదడు దెబ్బతినడం కారణంగా.ప్రవర్తనలో మార్పు వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ఆ రోజు విధులకు హాజరై తిరిగి ఇంటికి రావాల్సిన వ్యక్తి పరిస్ధితి ఇలా అయ్యిందని వారు వాపోయారు.