మాజీ మంత్రి ఈటెల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది.మెదక్ జిల్లా మూసాయిపేట మండలం అచ్చంపేట గ్రామ రైతుల లేఖతో వెలుగులోకి వచ్చిన ఈటెల వ్యవహారం కేసు విచారణ పూర్తి కాకముందే దేవరయాంజల్ దేవాలయాల భూముల కొనుగోళ్ళ అంశాన్ని తెరమీదికి తీసుకొచ్చాడు కేసీఆర్.
అయితే దేవరయాంజల్ భూములకు సంబంధించి రేవంత్ రెడ్డికి కూడా సంబంధం ఉండటంతో ఇప్పుడు రేవంత్ – కేసీఆర్ మధ్య ఫైట్ తో ఈటెల ఇష్యూ మొత్తం సైడ్ ట్రాక్ అయి రేవంత్ వైపు తిరిగింది.అయితే దేవరయాంజల్ భూముల కొనుగోళ్ళ విషయంలో ప్రభుత్వం విచారణ కమిటీని వేసిందని, ప్రభుత్వం తప్పు జరిగిందని నిరూపించాలని రేవంత్ గట్టిగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది.
అయితే తాజాగా దేవరయాంజల్ భూములను క్షేత్ర స్థాయి తనిఖీ చేసిన రేవంత్ రెడ్డి అక్కడ ఉన్న రకరకాల రియల్ ఎస్టేట్ వెంచర్ల అనుమతులను ప్రశ్నిస్తూ ప్రభుత్వం దీనిపై స్పందించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేయడం జరిగింది.ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం చూస్తే దేవరయాంజల్ భూముల విషయంలో ఈటెల రాజేందర్- కేసీఆర్ ఒక్కటిగా పోరాడే అవకాశం కనిపిస్తోంది.
ఇక ఈటెల భూముల వ్యవహారంలో మరి ప్రభుత్వం నియమించిన కమిటీ విచారణ ఇంకా పూర్తి కాని పక్షంలో ఈ వ్యవహారం ఇంకెంత దూరం వెళ్తుందనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.