కాలేజ్ అమ్మాయిలు, గృహిణులు ఇలా అంతా కూడా ఈమద్య కాలంలో గర్బం రాకుండా ఉండేందుకు గర్బనిరోదక మాత్రలు వాడుతున్నారు.గర్బనిరోదక మాత్రల వల్ల ఖచ్చితంగా గర్బం రాదు.
అయితే గర్బ నిరోదక మాత్రలు ఎక్కువ వాడటం వల్ల కావాలనుకున్నప్పుడు కూడా గర్బం రాదంటూ వైధ్యులు చెబుతున్నారు.అంతే కాకుండా గర్బనిరోధక మాత్రలు ఎక్కువగా వాడే ఆడవారిలో మెల్ల మెల్లగా మగవారి లక్షణాలు వస్తాయంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అవాంచిత గర్బం రాకుండా ఉండేందుకు వాడుతున్న గర్బనిరోదక మాత్రలు చాలా ప్రమాదకరం అని, వాటి వల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయంటూ చాలా కాలంగా నిపుణులు చెబుతున్నారు.చాలా అరుదుగా వేసుకుంటే పర్వాలేదు కాని, వారంకు ఒకటి లేదా రెండు వేసుకోవడం వల్ల అత్యంత ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంది అంటున్నారు.
అమెరికాలో దాదాపు రెండువేల అయిదు వందల మంది మహిళలపై చేసిన ప్రయోగంలో కళ్లు తిరిగే విషయాలు వెళ్లడయ్యాయి.అమెరికాలో పెళ్లికి ముందే అబ్బాయిలు, అమ్మాయిలు శృంగారంలో పాల్గొనడం, ఆ తర్వాత గర్బనిరోదక మాత్రలు ఉపయోగించడం చేస్తున్నారట.
అలా గర్బ నిరోదక మాత్రలు వేసుకున్న వారు ఆ తర్వాత గర్బం రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారట.కొంత మంది పెళ్లి తర్వాత గర్బం రాకుండా ఉండి ఇబ్బంది పడుతున్న వారిని తీసుకుని వారిపై సర్వే చేయగా, వారు మూడు నాలుగు సంవత్సరాల ముందు అతిగా గర్బనిరోదక మాత్రలు వేసుకున్న వారే ఎక్కువ ఉన్నారని తేలిందట.వారి గర్బాశయం పొరలు దళసరిగా మారి, అండం ఎదుగుదలను అడ్డుకుంటుందట.దాంతో పాటు శుక్రకణాలు వెళ్లేందుకు కూడా వీలు లేకుండా పొరలు అవుతాయట.అందువల్ల గర్బం దాల్చే అవకాశం లేదని అంటున్నారు.దాంతో పాటు హర్మోణులపై కూడా ప్రభావం చూపడంతో అబ్బాయిల్లో ఉండే లక్షణాలు మరియు ఆలోచనలు కలుగుతాయట.
మొత్తానికి గర్బనిరోదక మాత్రల వల్ల తల్లి కాలేక పోవడంతో పాటు పురుషుల లక్షణాలు వస్తాయని అంటున్నారు.