టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు ఎంతగానో సుపరిచితుడు అయిన హీరో సిద్ధార్థ్ గత కొద్ది సంవత్సరాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అసలు కనబడటంలేదు.ఈ మధ్య కాలంలో ఓ సినిమాలో కనిపించిన అది కూడా తమిళ్ డబ్ కావడంతో పెద్దగా తెలుగులో ఆకట్టుకోలేకపోయాడు.
ఇకపోతే సిద్ధార్థ్ చాలా కాలం నుంచి తెలుగు ప్రేక్షకులకు దూరంగా ఉంటున్నాడు.కారణం ఏమో తెలియదు కానీ ఆయన గత కొద్ది సంవత్సరాలుగా స్ట్రైట్ తెలుగు సినిమాలు మాత్రం చెయ్యట్లేదు.
లవర్ బాయ్ గా ఇమేజ్ వున్న సిద్ధార్థకు టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంది.అంతేకాదు అమ్మాయిల్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.
ఇక అసలు విషయంలోకి వెళితే.
చాలాకాలం తర్వాత ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న సినిమా మహా సముద్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు హీరో సిద్ధార్థ.
ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా నటిస్తుండగా అతిథి పాత్రలో హీరో సిద్ధార్థ కనిపించనున్నారు.నవంబర్ నెల నుండి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.ఈ విషయాన్ని పురస్కరించుకొని హీరో సిద్ధార్థ తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో షేర్ చేసుకున్నాడు.ఇందులోభాగంగా ఆయన ట్విట్టర్ ద్వారా భావోద్వేగపూరితమైన ట్వీట్ ను చేశారు.
ఇక సిద్ధార్థ చేసిన ట్వీట్ లో దాదాపు 8 సంవత్సరాల తర్వాత తాను మళ్లీ తెలుగు చిత్రంలో నటిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉందంటూ తెలిపాడు.అంతే కాకుండా ఈ సినిమా తనకి టాలీవుడ్ ఇండస్ట్రీలో మళ్లీ సినీ అవకాశాలు తెచ్చిపెడుతుంది అన్నట్లు ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
వీటితో పాటు ఓ గొప్ప టీం తో వర్క్ చేసేందుకు ఎదురుచూస్తున్నట్లు ఆయన రాసుకొచ్చారు.చూడాలి మరి ఈ సినిమా హీరో సిద్ధార్థకు టర్నింగ్ పాయింట్ అవుతుందో లేదో.