బాయ్స్ సినిమా తో లవర్ బాయ్ గా ప్రేక్షకులకు దగ్గరైన నటుడు సిద్దార్ద్.బాయ్స్ తరువాత వరుసగా అతడు చేసిన సినిమాలు హిట్ టాక్ అందడం తో ఒక రేంజ్ లో లవర్ బాయ్ గా సెటిల్ అయిపోయాడు.
‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ తదితర ఎన్నో చిత్రాల్లో నటించి ఎంతగానో మెప్పించాడు.బొమ్మరిల్లు చిత్రంలో సిద్దూ పాత్రలో సిద్దార్ధ్ ఎంతగా ప్రేక్షకులకు దగ్గర అయ్యాడో తెలిసిందే.
అయితే ఆ చిత్రం తరువాత తెలుగులో ఆయన చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో… గత ఏడేళ్లుగా తెలుగు పరిశ్రమకు దూరంగా ఉన్నాడు.అయితే ఈ మధ్యలో అడపా దడపా కొన్ని తమిళ అనువాద చిత్రాల్లో కనిపించినా డైరెక్ట్ తెలుగు మూవీ లో మాత్రం నటించలేదు.ఈ క్రమంలో దాదాపు ఏడేళ్ల తర్వాత సిద్ధార్థ్ తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు వస్తున్నాడు.‘మహాసముద్రం’ చిత్రంలో శర్వానంద్ తో పాటు సిద్ధార్థ్ కూడా నటిస్తున్నట్లు తెలుస్తుంది.ఈ సినిమాకు ఆర్ఎక్స్100ని తెరకెక్కించిన అజయ్ భూపతి దర్శకత్వం వహించనున్నాడు.
త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.
తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.సుంకర రామబ్రహ్మం ఈ సినిమాను నిర్మిస్తుండగా, సిద్ధార్థ్ తమ చిత్రంలో నటిస్తున్న విషయాన్ని ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ అధికారికంగా ప్రకటించింది.
మొత్తానికి చాలా సంవత్సరాల గ్యాప్ తరువాత సిద్దార్ద్ మరోసారి తెలుగు ప్రేక్షకులను నేరుగా అలరించనున్నాడు అన్నమాట.