యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఇండియన్ స్టార్ గా మారిపోయాడు.బాలీవుడ్ హీరోలని మించిపోయి తన మార్కెట్ రేంజ్ పెంచుకున్నాడు.
ఖాన్ త్రయం సినిమాలు కేవలం హిందీకి మాత్రమే పరిమితం అవుతాయి.అయితే ప్రభాస్ సినిమాలని పాన్ ఇండియా రేంజ్ లో అన్ని భాషల ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారు.
దేశ వ్యాప్తంగా అన్ని భాషలలో డార్లింగ్ ప్రభాస్ కి ఫ్యాన్స్ ఉన్నారు.అలాగే విదేశాలలో కూడా తన మార్కెట్ స్కోప్ ని ప్రభాస్ పెంచుకున్నాడు.
హాలీవుడ్ సినిమాల రేంజ్ లో అతని సినిమాల కోసం నిర్మాతలు డబ్బులు పెట్టడానికి రెడీ అవుతున్నారు.బాహుబలికి ముందు వరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో వంద కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ అని అనుకునేవారు.
అయితే ఆ సినిమా కోసం రాజమౌళి ఏకంగా మూడు వందల కోట్లకి పైగా బడ్జెట్ పెట్టాడు.అయినా కూడా అదే రేంజ్ లో ప్రపంచ వ్యాప్తంగా 15 వందల కోట్లకి పైగా కలెక్షన్ ని ఆ సిరీస్ సొంతం చేసుకుంది.
తరువాత ప్రభాస్ సాహో కోసం 250 కోట్ల వరకు పెట్టుబడి పెట్టారు.ఈ సినిమా ఏవరేజ్ టాక్ సొంతం చేసుకున్న 400 కోట్ల వరకు కలెక్షన్ రాబట్టింది.
ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమా కోసం 200 కోట్లకి పైగానే ఖర్చు పెట్టారు.ఇక నాగ్ అశ్విన్ తో చేస్తున్న సినిమా కోసం 450 కోట్ల బడ్జెట్ అనుకుంటున్నారు.
ఇలా భారీ బడ్జెట్ చిత్రాలకి ఇప్పుడు ప్రభాస్ కేరాఫ్ అడ్రెస్ అయిపోయాడు.ఈ నేపధ్యంలో బాలీవుడ్ దర్శకులు కూడా పాన్ ఇండియా సినిమాల కోసం ప్రభాస్ వైపే చూస్తున్నారు.
ప్రస్తుతం ఓం రౌత్ తో ఆది పురుష్ సినిమా చేస్తున్న ప్రభాస్ తో మరో బాలీవుడ్ దర్శకుడు భారీ బడ్జెట్ తో ఒక యాక్షన్ అడ్వాంచర్ మూవీ తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాడు.హృతిక్ రోషన్ తో బ్యాంగ్ బ్యాంగ్,వార్, చిత్రాలను రూపొందించిన సిద్ధార్థ్ ఆనంద్ రీసెంట్ గా ప్రభాస్ కి కథ వినిపించడం జరిగిందని, స్టోరీ నచ్చడంతో ప్రభాస్ కూడా ఒకే చెప్పాడని తెలుస్తుంది.
అయితే ఇటు ప్రభాస్, అటు సిద్ధార్ధ్ వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళడానికి రెండేళ్ల నుంచి మూడేళ్లుపెట్టె అవకాశం ఉందని బిటౌన్ లో టాక్ వినిపిస్తుంది.
.